📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Budget 2026: వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా రోడ్ మ్యాప్

Author Icon By Rajitha
Updated: February 11, 2026 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర బడ్జెట్ పై చర్చలో వైసిపి ఎంపి మేడా రఘునాథరెడ్డి

రాజంపేట : దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ కనిపిస్తోందని, దేశ ఆర్థిక వృద్ధి ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు, యువ వ్యవస్థాపకులపై ఆధారపడి ఉందని అయితే బడ్జెట్లో వారి ఆశలు నెరవేరలేదని వైసిపి ఎంపీ మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు ముఖ్య అంశాలను బడ్జెట్ పై చర్చలు మంగళవారం రాజ్యసభదృష్టికి తీసుకువచ్చారు. మధ్యతరగతికి పన్ను భారంలో ఉపశమనం లేదన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు పెరుగుతున్నప్పటికీ పన్ను స్లాబులు యథాతథంగా కొనసాగడం వల్ల ద్రవ్యోల్బణ ప్రభావంతో మధ్య తరగతి ప్రజలపై అదనపు భారముందని పేర్కొన్నారు.

Read also: AP Assembly Session : అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ?

Roadmap towards the goal of Developed India 2047

సంవత్సరానికి సుమారు 15 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు గృహం, ఆరోగ్యం, విద్య ఖర్చులతో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు. 30 శాతం గరిష్ట పన్ను రేటు తక్కువ ఆదాయ స్థాయిలోనే వర్తించడంతో పెట్టుబడులు, వినియోగం దెబ్బతింటున్నాయని, ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్టాండర్డ్ డిడక్షను పెంచకపోవడం కూడా నిరాశ కలిగించిందని విమర్శించారు. వ్యాపారాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోపం వ్యాపార వాతావరణాన్ని మెరుగుపర్చాల్సిన సమయంలో దీర్ఘకాలిక పన్ను వివాదాల పరిష్కారానికి ప్రత్యేక పథకం లేకపోవడం నిరుత్సాహకరమన్నారు. ప్రస్తుతం లక్షలాది పన్ను అప్పీలు పెండింగ్లో ఉండటంతో వ్యాపార మూలధనం నిలిచిపోతోందని తెలిపారు.

జీఎస్టీ రాయితీ సమానంగా అమలు చేయాలని డిమాండ్

జీఎస్టీ అమలులో కొంతమంది ఫీల్డ్ అధికారులు అనవసర నోటీసులు జారీ చేస్తూ వ్యాపారులను వేధిస్తున్నారని తెలియజేశారు. నమ్మకపూరిత విధానం అవసరమన్నారు. అలాగే, వర్క్స్ కాంట్రాక్టుల్లో ఉపకాంట్రాక్టర్లకు జీఎస్టీ రాయితీ సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వల్ల ఎంఎస్ఎంఈలకు నష్టం జరుగుతోందని, జీఎస్టీ రిఫండ్లు సమయపాలనతో ఇవ్వాలని కోరారు. జనాభా లాభాన్ని ఉపయోగించుకునే విధానాలు అవసరం అన్నారు. దేశ జనాభాలో దాదాపు 65 మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారని, 2041 నాటికి యువభారత్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ ఉపాధి మాత్రమే ఏటా అవసరమైన దాదాపు కోటి ఉద్యోగాలను సృష్టించదు.

కాబట్టి, ముఖ్యంగా అధిక వృద్ధి చెందుతున్న రంగాలలో యువ వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడంపై విధానం దృష్టి పెట్టాలని సూచించారు. మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, టియర్-2, టియర్-3 నగరాల్లోనూ వ్యాపార అవకాశాలు పెంపొందించేలా క్రెడిట్ గ్యారంటీ, నియంత్రణ సడలింపులు అవసరమన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలిక ఎంట్రప్రెన్యూర్షిప్ డివిడెండ్ రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ 2026-27కు వైసిపి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభలో తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Budget 2026-27 GST Income Tax latest news Meda Raghunatha Reddy Middle class Rajya Sabha Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.