విజయవాడ: ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు శాసనసభకు హాజరుకాకుండా కేవలం సంతకాలు చేసి సర్దుకోవడం ఏం సభ్యత, సంస్కారం అని నైతిక విలువల(Ethics) కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మండలి బుద్దప్రసాద్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైన మండలి బుద్దప్రసాద్ అధ్యక్షతన శాసనసభ నైతిక విలువల కమిటీ సభ్యులు వివిధ అంశాలను కీలకంగా చర్చించారు. జీతభత్యాలతో పాటు ప్రొటోకాల్ మర్యాదలు పొందుతూ అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించింది.
ఎథిక్స్ కమిటీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరించడంపై చర్చ జరగాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు సభకు వచ్చి చట్టాల నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందేనని శాసనసభ నైతిక విలువల కమిటీ స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల నైతిక ప్రవర్తన ప్రాధాన్యతను పెంచడంలో ఎథిక్స్ కమిటీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని కమిటీ ఛైర్మన్ మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ (YSRCP)ఎమ్మెల్యేలు శాసనసభకు రాకపోవడం నైతికత ఎలా అవుతుందనే అంశాన్ని కమిటీ సభ్యులు లేవనెత్తారు. తమను ఎన్నుకున్న ప్రజలు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత సమస్యలను శాసనసభా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి పాటుపడాలని హితవు పలికారు. సభకు రాకుండా ఈ బాధ్యతను విస్మరించడం అనైతికమే అవుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. సభకు రాకపోవడం అనైతికమే, తమ బాధ్యతను గుర్తించి వ్యవహరించాలని కమిటీ తరపున విజప్తి చేద్దామనే అభిప్రాయాన్ని కొందరు సభ్యులు వ్యక్తం చేశారు. ఎవరెవరు జీతభత్యాలు తీసుకుంటున్నారు, ఎవరెవరు సభకు రాకుండా బయట రిజిస్టర్లో సంతకాలు చేసి వెళుతున్నారనేదీ రికార్డులను పరిశీలించి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని ఇతర సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో వచ్చే సమావేశం నాటికి ఈ రికార్డులను కమిటీ ముందుంచాలని ఛైర్మన్ బుద్ధప్రసాద్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ను ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: