📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Today News : Brahmotsavam – భక్తుల సౌలభ్యానికి ప్రత్యేక ఏర్పాట్లు : ఇఒ శ్యామలరావు

Author Icon By Shravan
Updated: August 21, 2025 • 10:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Brahmotsavam : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి (Lord Venkateswara) సెప్టెంబర్ 24 నుండి తొమ్మిదిరోజులు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సౌలభ్యంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు 22 జె. శ్యామలరావు, అదనపు చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి తెలిపారు. తొమ్మిదిరోజులు ఉదయం వాహన సేవలు ఆలయ మాఢవీధుల్లో ఊరేగనున్నందున వేడుకలకు అశేషంగా భక్తులు తరలివస్తారని అంచనాతో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టడం జరుగుతోందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో గ్యాలరీలకు ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, అందులో ఉండే భక్తులకు సౌకర్యాలు, సదుపాయాలు, భద్రత పరంగా తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పటిష్ట ఏర్పాట్లపై (Arrangements) బుధవారం సాయంత్రం ఆలయ మాడవీధుల్లో తనిఖీలు చేశారు.

తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, టిటిడి సివిఎస్ ఒ కెవి మురళీకృష్ణ, తిరుమల అదనపు ఎస్పీ ఐ. రామకృష్ణ, డిఎస్పీ కె. విజయశేఖర్, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, టిటిడి విజిలెన్స్ విఎస్సీలు ఎన్టీవిరామ్కుమార్, సురేంద్ర, ఆలయ ఏవిఎస్ రాజశేఖర్, తిరుమల సీఐలు విజయకుమార్, రాముడు, సిఇ సత్యనారాయణ, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, పిఆర్ నీలిమతో కలసి టిటిడి ఇఒ జె.శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ఏర్పాట్లను పరిశీలించారు. మాఢవీధుల్లో వాహనసేవలు జరిగే సమయంలో గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు ఉంటాయన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లు పక్కా

మాఢవీధుల్లోని గ్యాలరీల్లో పోలీసులు, శ్రీవారిసేవకులు, ఎస్పిఎఫ్, ఆక్టోపస్, విజిలెన్స్ బలగాలు భద్రతాపరంగా, సేవలకు సిద్ధంగా ఉంటారన్నారు. దాదాపు 2 లక్షలమంది లోపు భక్తులు రావచ్చని అంచనాతో అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆలయం ముందు, మాఢవీధుల్లో గ్యాలరీలు నిర్మాణం పనులు తనిఖీ చేశారు. గ్యాలరీల్లో భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు. టీ,కాఫీ, పాలు అందించేలా శ్రీవారిసేవకులు, టిటిడి ఉద్యోగులను నియమిస్తున్నామన్నారు. తిరుమలలో ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని, అదనపు పార్కింగ్ ప్రదేశాలకు సూచిక బోర్డులు ఏర్పాటుచేస్తున్నారు. ఆ తొమ్మిదిరోజులు అన్ని ఆర్జితసేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు దర్శనాలు, బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దుచేస్తున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/ncd-4-0-survey-to-identify-cancer-cases/andhra-pradesh/533489/

Brahmotsavam 2025 Breaking News in Telugu Devotees Facilities TTD Latest News in Telugu Telugu News online Tirumala Brahmotsavam News Tirumala Festival Arrangements TTD Devotees Services

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.