తిరుమల : తిరుమల(Tirumala) లడ్డూ “ధర” పెంపు పై కొన్ని మీడియా చానెళ్ళు తప్పుడు వార్తలు ప్రసారం చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా స్పందించింది. లడ్డూ ధరల పెంచే యోచనపై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దని, బాధ్యతారాహిత్యమైన మీడియా చానెళ్ళు ఏమాత్రం జాగ్రత్త లేకుండా దుష్ప్రచారాలు చేయడం మంచిదికాదని టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు(BR Naidu) సామాజిక మాధ్యమం వేదికగా ఖండించారు. లడ్డూ ప్రసాదం ధరను పెంచే ఆలోచన, ప్రణాళిక టిటిడికి లేదని పునరుద్ఘాటించారు.
Read Also: Krishna Chaitanya: పంచారామాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్
కాగా ఇదివరకు టిటిడిలో కొనసాగిన తెలుగుదేశం ప్రభుత్వంలోని టిటిడి పాలకమండళ్ళు ధరలు పెంచిన సందర్భాలు లేదు. లడ్డూ ధరలను, కొన్ని ప్రత్యేక సేవల టిక్కెట్లు ధరలు అప్పటి
కాంగ్రెస్ ప్రభుత్వంలోని టిటిడి బోర్డులు పెంచడం విశేషం. ఇప్పటికే తిరుమల లడ్డూ ధర రూ50లకు గతంలోని టిటిడి బోర్డు(BR Naidu) పెద్దలు పెంపుచేసి సామాన్యభక్తులకు భారంగా మార్చారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయాలపై మీడియా ఛానెళ్ళు బాధ్యతను తెలుసుకుని ఒకటికి రెండుసార్లు పరిశీలించాలన్నారు. సామాన్య భక్తుల కోసం పలు రకాలుగా విధానాలు అమలు సులభ దర్శనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: