📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Botsa vs Lokesh: శాసనమండలిలో తిరుమల కల్తీ నెయ్యిపై చర్చ

Author Icon By Anusha
Updated: February 18, 2026 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ వ్యవహారం పై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. మంగళవారం, బుధవారం కూడా వైసీపీ తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని అందజేయగా, ఛైర్మన్ మోషేన్ రాజు దానిని డిస్మిస్ చేశారు. దీంతో మండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందుకే మండలిలో చర్చకు డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Read Also: Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

Botsa vs Lokesh: Debate on Tirumala adulterated ghee in the Legislative Council

ఆసక్తిగా ఉంది

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ లాబీలో నిర్వహించిన చిట్ చాట్ లో స్పందించారు. మండలిలో వైసీపీ నేతలపై బొత్స సత్యనారాయణ పట్టు కోల్పోయారన్నారు. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారని, ఒకరు లడ్డూకల్తీపై చర్చించాలని, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని అడిగారని పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలని ఆసక్తిగా ఉందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AndhraPradesh Botsa vs Lokesh GheeAdulteration latest news LegislativeCouncil Telugu News TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.