📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం – బొత్స సత్యనారాయణ

Author Icon By Sudheer
Updated: December 28, 2024 • 11:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలపై రూ.15,000 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన ఆరోపించారు. సామాన్య ప్రజలు ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలా చేయడం అన్యాయమన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం గత 7 నెలల్లో రూ.74 వేల కోట్ల అప్పు చేసి, తాజాగా వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్ల నిధులు తెచ్చుకుని, మొత్తంగా రూ.లక్ష కోట్ల అప్పు చేసింది అని బొత్స ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజల నడ్డి విరిచే నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో అని బొత్స ప్రశ్నించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెనక్కి తీసుకోవడం తక్షణ అవసరం అని డిమాండ్ చేశారు. ప్రజలు ఇలాంటి భారం తట్టుకోలేరని హెచ్చరించారు. ప్రజల ఆందోళనలను ప్రభుత్వం సకాలంలో పరిగణలోకి తీసుకుని, విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు దీని మీద మరింత ఆందోళన వ్యక్తం చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

AP Power Bill Hike Botsa Satyanarayana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.