📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

YCP : రాజకీయాలు దిగజారిపోతున్నాయంటూ బొత్స కామెంట్స్

Author Icon By Sudheer
Updated: June 23, 2025 • 9:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని, ప్రభుత్వ వైఖరి దయనీయంగా మారిందని విమర్శించారు. ముఖ్యంగా జగన్ పర్యటన(Jagan tour)లో జరిగిన ప్రమాదం విషయంపై పోలీసులు మొదట ఒక మాట చెప్పి, తర్వాత మాట మార్చిన తీరుపై బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా ప్రమాదానికి జగన్ వాహనం సంబంధం లేదన్న మాటను చెప్పి, ఆపై రాజకీయ ఒత్తిళ్లకు లోనై మాట మార్చారని ఆరోపించారు.

రాజకీయ కక్షతో వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కూటమి ప్రభుత్వం

ప్రమాదానికి కారణమైన వ్యక్తిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసిన తరువాత మళ్లీ నింద జగన్ వాహనం మీద వేయడమంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమేనని బొత్స వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పర్యటనకు రోప్ పార్టీ ఎందుకు లేకపోయిందో తెలియదని, బందోబస్తు నిర్వహణలో పోలీసుల వైఫల్యం ఉన్నదని ఆయన అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలతో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. యోగా దినోత్సవం పేరిట కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవడమే కాక, దాని వైఫల్యాన్ని దాచేందుకే కారు ప్రమాదం అంశాన్ని తెరపైకి తెచ్చారు అని విమర్శించారు.

యువత ఆందోళన – పోలీసులు దురుసు ప్రవర్తన

ఆందోళన చేస్తున్న యువతపై లాఠీఛార్జ్ చేయడం అమానవీయమని, ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు ప్రజలు మళ్లీ ఉద్యమిస్తారని బొత్స హెచ్చరించారు. ప్రజా నాయకుడిని కలిసేందుకు వచ్చిన ప్రజలపై భయభ్రాంతులు సృష్టించటం దారుణమని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకున్న ఎస్సై వ్యవహారం నిజమేనని ప్రశ్నించారు. షర్మిలపై కూడా విమర్శలు చేస్తూ, ఆమె కేవలం తన ఉనికిని చాటుకునేందుకే జగన్ పై మాట్లాడేందుకు కూటమి నేతల ఎదురు చూపుతో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోలుకుంటుందంటే, ఇటువంటి అన్యాయాలు తగిన ప్రశ్నలు ఎదుర్కోవాలని బొత్స పేర్కొన్నారు.

Read Also : YCP Govt : గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు – పవన్ కళ్యాణ్

Botsa Satyanarayana Coalition Government Google News in Telugu jagan tour

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.