Boma Akhila Priya : భూమా అఖిలప్రియ నిరసన

Read Time:  1 min
akhila priya prostest
akhila priya prostest
FONT SIZE
GET APP

టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇవాళ దిన్నెదేవరపాడు వద్ద సాక్షి కార్యాలయం ఎదుట కోళ్లతో నిరసన తెలిపారు. గతంలో విలేకరుల సమావేశంలో పేపర్‌లో వచ్చే ధరకే చికెన్ అందుబాటులోకి తేవాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, తాను ప్రజల కోసం పోరాడుతుంటే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కమీషన్లు తీసుకుంటున్నట్లు కథనాలు ప్రచురించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీపై తీవ్ర విమర్శలు

ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం తన ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని భూమా అఖిలప్రియ మండిపడ్డారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల నుంచి కేజీకి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు నష్టం కలిగించే విధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, తాను మాత్రం ప్రజల ప్రయోజనాల కోసం న్యాయంగా పోరాడుతున్నానని అన్నారు.

Akhila
Akhila

టీడీపీ నిరసనలో ఓ సహనం

అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న మీడియా సంస్థలపై దాడులు చేసేవారని భూమా అఖిలప్రియ ఆరోపించారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని, అందుకే తాము శాంతియుతంగా మీడియా కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నామని చెప్పారు.

చికెన్ ధరలు తగ్గాయి – అవినీతి లేదని స్పష్టం

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నంద్యాలలో చికెన్ ధర కేజీకి రూ.250 నుంచి రూ.280 ఉండేదని, కానీ తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆళ్లగడ్డలో రూ.150 నుంచి రూ.170కి తగ్గిందని భూమా అఖిలప్రియ తెలిపారు. తాము అవినీతికి పాల్పడినట్లయితే చికెన్ ధరలు తగ్గకుండా పెరగాల్సిందని, తప్పుడు కథనాలు ప్రచురిస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.