Bill Gates: గ్లోబల్ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి నుంచి అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు. సెక్రటేరియట్ వద్ద ఆయనకు చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్ కు మంత్రులను చంద్రబాబు పరిచయం చేశారు.
ప్రధాన రంగాలపై చర్చలు
ఈ పర్యటనలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆరోగ్యం, కృత్రిమ మేధ (AI), డిజిటల్ పాలన, వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య సంబంధిత పథకాలు, వాటిని రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా విస్తరించే విధానాలు, AI ఆధారిత సాంకేతికతను ప్రజాసేవల్లో ఎలా వినియోగించవచ్చనే అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమయింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ఇవిగో.
Read Also: AP: ఎన్టీఆర్ ట్రస్టీ బృందాన్ని అభినందించిన చంద్రబాబు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: