📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Bijapur: పాపను కారులో వదిలేసి దర్శనానికి వెళ్లిన తల్లితండ్రులు..ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

Author Icon By Anusha
Updated: August 18, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నాటకలోని బీజాపూర్‌ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి తన భార్య,పాప, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మహానంది క్షేత్రానికి (Mahanandi Temple) దేవుడి దర్శనానికి వచ్చాడు. కుటుంబం అంతా నంది సర్కిల్ దగ్గర తమ కారును పార్క్ చేసి, ఆపై దర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో ఒక పసిపాప కారులోనే ఉండిపోయి ప్రాణాపాయం ఎదుర్కొన్న ఘటన స్థానికులను కలవరపరిచింది.వారు తమ కారును నంది సర్కిల్ దగ్గర పార్క్ చేశారు. పాప నిద్రపోతుండటంతో భర్త చూసుకుంటాడని భార్య అనుకుంది. భార్య చూసుకుంటుందని భర్త భావించారు. భర్త మూత్రవిసర్జనకు వెళ్లి పాపను భార్య తీసుకెళ్లిందని భావించాడు.. వేర్వేరుగా దర్శనానికి వెళ్లారు. పాప కారులోనే ఉండిపోయింది.

గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు

కారు అద్దాలన్నీ మూసి ఉన్నాయి.. తలుపులు కూడా లాక్ చేసి ఉన్నాయి. దీంతో చిన్నారికి ఊపిరాడటం లేదు. .చెమటలు పట్టి నిద్రలేచి ఏడుస్తోంది. కారులో చిన్నారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. దేవస్థానం సమాచార కేంద్రంలోని రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వర్, పొరుగుసేవల ఉద్యోగి నాగార్జునరెడ్డికి ఈ విషయం చెప్పారు. వారు వెంటనే కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ (Constable Chandrashekhar) కు సమాచారం ఇచ్చారు. చంద్రశేఖర్ వెంటనే స్పందించి రాయితో కారు అద్దాలు పగలగొట్టారు. ఆ చిన్నారిని బయటకు తీశారు.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పాపకు సమాచార కేంద్రంలో సపర్యలు చేయడంతో ప్రాణాపాయం నుంచి కాపాడారు. చిన్నారి కొద్దిసేపటికి కోలుకుంది.

పాప గురించి ప్రకటన చేశారు

ఆ తర్వాత ఆలయంలో మైకుల ద్వారా పాప గురించి ప్రకటన చేశారు. అనంతరం 15 నిమిషాల తర్వాత తల్లిదండ్రులు వచ్చి పాపను తీసుకువెళ్లారు.. వారిని పోలీసులు మందలించారు. చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌కు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కానిస్టేబుల్ చూపిన చొరవను హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. స్థానికులు పాపను గమనించబట్టి సరిపోయింది.. లేకపోతే పరిస్థితి ఏంటి. పాపం పాపను కారులోనే మర్చిపోయి తల్లిదండ్రులు దర్శనానికి వెళ్లడం విచిత్రంగా ఉందని స్థానికులు చర్చించుకున్నారు.. చిన్నారి సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/naveen-patnaik-naveen-patnaiks-health-is-very-critical/national/531853/

baby left in car Bijapur family Breaking News child rescue Karnataka News latest news Mahanandi temple parents negligence Telugu News temple incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.