Kakinada news: పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న సాంప్రదాయ నృత్య ప్రదర్శనలకు హాజరైన ఓ యువ నర్తకి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి(Shivakoti)లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవాల ప్రారంభానికి నాట్య ప్రదర్శనలు ఇచ్చేందుకు వచ్చిన బృందానికి చెందిన 17 ఏళ్ల పాలపర్తి భవ్యశ్రీ(Bhavya Sri) పై అంతస్తు నుంచి జారి పడడంతో తీవ్రంగా గాయపడింది.
Read Also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి
రాజమహేంద్రవరం నుంచి వచ్చిన 12 మంది కళాకారులకు ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక మండపంలో వసతి ఏర్పాట్లు చేశారు. ప్రదర్శనకు సిద్ధమవుతూ భవ్యశ్రీ తన గది నుంచి దిగుతూ ఉండగా మెట్లపై నుంచి అదుపుతప్పి కింద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి(Died) చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
భవ్యశ్రీ ధరించిన ఎత్తైన పాదరక్షల వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తోటి కళాకారులు తెలిపారు. అయితే మెట్లకు సరైన రక్షణ గోడ లేకపోవడమే అసలు కారణమని ఆమె సోదరి పాలపర్తి మధు ఆరోపించారు. నాట్య బృందంలో ఉన్నవారిలో ఎక్కువ మంది మైనర్లే కావడం గమనార్హం. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులకు మధు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: