Roja: రోజా అవినీతిపై తీవ్ర విమర్శలు చేసిన భాను ప్రకాశ్

Read Time:  1 min
Roja
Roja
FONT SIZE
GET APP

వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కె. రోజా (Roja) మరియు టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మళ్లీ హీట్ పెంచింది. తాజాగా, భాను ప్రకాశ్ (Bhanu Prakash) ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజా కుటుంబంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు.

Roja
Roja

“ఇసుక, బియ్యం, గంజాయి అక్రమ రవాణా చేశారు”

భాను ప్రకాశ్ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యల ప్రకారం రోజా (Roja) కుటుంబం ప్రభుత్వ అధికారాన్ని వాడుకొని బియ్యం మరియు ఇసుక అక్రమ రవాణాలో పాల్గొనిందని, గంజాయి దందా (Marijuana racket) లోనూ వారి ప్రమేయం ఉన్నట్లు తనకు సమాచారం ఉందని, నిజం తేలితే “మెడ పట్టుకుని లాక్కెళ్లి జైలుకు వెళతారు” అని తీవ్రంగా హెచ్చరించారు. తమపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా తాము వెనక్కి తగ్గబోమని భాను ప్రకాశ్ స్పష్టం చేశారు. నిజాలు బయటికి రావాల్సిందేనని, ప్రజలముందు నిజాన్ని ఉంచడం రాజకీయ నాయకుడిగా తన బాధ్యత అన్నారు.

గత వివాదస్పద వ్యాఖ్యల ప్రస్తావన

ఇదే నేపథ్యంలో, ఇటీవల భాను ప్రకాశ్ రెడ్డి చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. “రూ. 2 వేలు ఇస్తే రోజా ఏ పనైనా చేస్తుంది” అనే వ్యాఖ్యతో పాటు, “విలన్ పాత్రలకు ఎక్కువ అనిపిస్తుంది, హీరోయిన్ పాత్రలకు తక్కువ” అంటూ చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శల వర్షం.

మహిళా కమిషన్ల దృష్టికి తీసుకెళ్లిన రోజా

ఈ వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ, జాతీయ మహిళా కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ల వద్ద ఫిర్యాదు చేశారు. టీడీపీ మహిళలను కించపరచే సంస్కృతిని ప్రోత్సహిస్తోందని ఆమె మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/constitution-the-country-is-united-by-the-constitution-former-union-minister-chinta-mohan/andhra-pradesh/525633/

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.