📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Banglore: లైట్లు ఆఫ్ చేయమన్నందుకు.. డంబెల్‌తో హత్య చేసిన యువకుడు

Author Icon By Anusha
Updated: November 2, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో మానసిక ఆత్మనియంత్రణ లేకుండా కోపావేశానికి గురవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఆవేశం ఒక్కసారిగా హింసగా మారి ప్రాణాలపై దాడి చేసే స్థితికి చేరుకుంటోంది. ఇలాంటి ఘోర సంఘటన తాజాగా బెంగళూరులో చోటుచేసుకుంది.బెంగళూరు (Banglore) లోని ఓ ఆఫీసులో లైట్లు ఆఫ్ చెయ్ అన్నందుకు.. మేనేజర్‌ను చంపేశాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు. 

Read Also: Breaking News – Tragedy : దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య..ఎక్కడంటే !!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగళూరు (Banglore) గోవిందరాజ్‌నగర్‌లోని MC లేఅవుట్ సమీపంలో ఉన్న డిజిటల్ వాల్ట్ అనే ఫోటో-ఎడిటింగ్ సంస్థలో.. భీమేష్ బాబు అనే 41 ఏళ్ల వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రకాశవంతమైన కాంతి భీమేష్ బాబుకు పడదు. అలాంటి కాంతికి బాబు సున్నితంగా ఉంటాడు.

అయితే ఆఫీస్‌లో అనవసరమైన లైట్లు ఆపివేయమని తరచుగా సహోద్యోగులను కోరేవాడు. ఆదివారం (నవంబర్ 2) అర్ధరాత్రి ఒంటి గంట సమయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ (AP) విజయవాడకు చెందిన టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ (24) వీడియోలు ఎడిట్ చేస్తున్నాడు. ఆ సమయంలో బాబు.. అతడిని లైట్లు ఆఫ్ చేయాలని చెప్పాడు.

వంశీ బాబుపై కారం పొడి చల్లాడు

దీంతో కోపద్రిక్తుడైన వంశీ.. బాబుతో వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధం కాస్త మరో స్థాయికి వెళ్లింది. కోపంతో ఊగిపోయిన వంశీ బాబుపై కారం పొడి చల్లాడు. తర్వాత ఇనుప డంబెల్‌తో తల, ముఖం, ఛాతీపై పలుసార్లు కొట్టాడు. బాబు కుప్పకూలిపోవడంతో.. భయాందోళనకు గురైన వంశీ.. నాయందహళ్లిలో ఉన్న తన సహోద్యోగి గౌరీ ప్రసాద్‌ (Gauri Prasad) ను కలవడానికి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.

జరిగిన విషయం తెలుసుకున్న ప్రసాద్.. అతడి స్నేహితుడి సహాయం కోరాడు. అనంతరం ఆ ముగ్గురూ ఆఫీసుకు తిరిగి వచ్చారు.మేనేజర్ బాబు (Manager Babu) కదలకుండా ఉండటం చూసి.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. అప్పటికే బాబు చనిపోయాడని ప్రకటించారు.

హత్య నేరం కింద కేసు నమోదైంది

ఈ ఘటన తర్వాత నిందితుడు వంశీ.. గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అనతంరం అతడిపై హత్య నేరం కింద కేసు నమోదైంది.లైట్లు ఆఫ్ చేయాలనే విషయంపై వివాదం తలెత్తి.. హత్యకు దారితీసిందని డీసీ (వెస్ట్) గిరీష్ ఎస్ ధ్రువీకరించారు. హత్యకు దారితీసిని ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

AP Youth Bangalore Crime latest news Murder Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.