हिन्दी | Epaper

Latest News: Banglore: లైట్లు ఆఫ్ చేయమన్నందుకు.. డంబెల్‌తో హత్య చేసిన యువకుడు

Anusha
Latest News: Banglore: లైట్లు ఆఫ్ చేయమన్నందుకు.. డంబెల్‌తో హత్య చేసిన యువకుడు

దేశంలో మానసిక ఆత్మనియంత్రణ లేకుండా కోపావేశానికి గురవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఆవేశం ఒక్కసారిగా హింసగా మారి ప్రాణాలపై దాడి చేసే స్థితికి చేరుకుంటోంది. ఇలాంటి ఘోర సంఘటన తాజాగా బెంగళూరులో చోటుచేసుకుంది.బెంగళూరు (Banglore) లోని ఓ ఆఫీసులో లైట్లు ఆఫ్ చెయ్ అన్నందుకు.. మేనేజర్‌ను చంపేశాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు. 

Read Also: Breaking News – Tragedy : దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య..ఎక్కడంటే !!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగళూరు (Banglore) గోవిందరాజ్‌నగర్‌లోని MC లేఅవుట్ సమీపంలో ఉన్న డిజిటల్ వాల్ట్ అనే ఫోటో-ఎడిటింగ్ సంస్థలో.. భీమేష్ బాబు అనే 41 ఏళ్ల వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రకాశవంతమైన కాంతి భీమేష్ బాబుకు పడదు. అలాంటి కాంతికి బాబు సున్నితంగా ఉంటాడు.

అయితే ఆఫీస్‌లో అనవసరమైన లైట్లు ఆపివేయమని తరచుగా సహోద్యోగులను కోరేవాడు. ఆదివారం (నవంబర్ 2) అర్ధరాత్రి ఒంటి గంట సమయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ (AP) విజయవాడకు చెందిన టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ (24) వీడియోలు ఎడిట్ చేస్తున్నాడు. ఆ సమయంలో బాబు.. అతడిని లైట్లు ఆఫ్ చేయాలని చెప్పాడు.

వంశీ బాబుపై కారం పొడి చల్లాడు

దీంతో కోపద్రిక్తుడైన వంశీ.. బాబుతో వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధం కాస్త మరో స్థాయికి వెళ్లింది. కోపంతో ఊగిపోయిన వంశీ బాబుపై కారం పొడి చల్లాడు. తర్వాత ఇనుప డంబెల్‌తో తల, ముఖం, ఛాతీపై పలుసార్లు కొట్టాడు. బాబు కుప్పకూలిపోవడంతో.. భయాందోళనకు గురైన వంశీ.. నాయందహళ్లిలో ఉన్న తన సహోద్యోగి గౌరీ ప్రసాద్‌ (Gauri Prasad) ను కలవడానికి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.

 Banglore

జరిగిన విషయం తెలుసుకున్న ప్రసాద్.. అతడి స్నేహితుడి సహాయం కోరాడు. అనంతరం ఆ ముగ్గురూ ఆఫీసుకు తిరిగి వచ్చారు.మేనేజర్ బాబు (Manager Babu) కదలకుండా ఉండటం చూసి.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. అప్పటికే బాబు చనిపోయాడని ప్రకటించారు.

హత్య నేరం కింద కేసు నమోదైంది

ఈ ఘటన తర్వాత నిందితుడు వంశీ.. గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అనతంరం అతడిపై హత్య నేరం కింద కేసు నమోదైంది.లైట్లు ఆఫ్ చేయాలనే విషయంపై వివాదం తలెత్తి.. హత్యకు దారితీసిందని డీసీ (వెస్ట్) గిరీష్ ఎస్ ధ్రువీకరించారు. హత్యకు దారితీసిని ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870