Speaker Ayyanna Patrudu: అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై జరిపిన భీకర దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదిరింది. దీని ప్రభావం పొరుగున ఉన్న బహ్రెయిన్పై కూడా పడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బహ్రెయిన్లో సుమారు 50 వేల మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో మన తెలుగువారి భద్రతపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేకంగా ఆరా తీశారు.
Read Also: BR Naidu: డీప్ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం
నాతవరం ప్రవాసితో ఫోన్ లో చర్చ.. యోగక్షేమాల ఆరా
స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన సొంత నియోజకవర్గం నాతవరానికి చెందిన ఒక ప్రవాసితో ఫోన్ ద్వారా మాట్లాడారు. అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులు, క్షిపణి దాడుల భయం, నిత్యావసరాల లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగువారందరూ సురక్షితంగా ఉన్నారని, అయితే యుద్ధ వార్తలతో ఆందోళన చెందుతున్నారని ప్రవాసి స్పీకర్కు వివరించారు.అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: