📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Today News : Author – సుప్రసిద్ధ రచయిత్రి కోకా విమల కుమారి మృతి

Author Icon By Shravan
Updated: September 4, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Author : ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, సుప్రసిద్ధ రచయిత్రి కోకా విమలకుమారి విజయవాడలోని స్వగ్రహంలో ఈరోజు కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటివద్దనే వున్నారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. విమలకుమారి కృష్ణాజిల్లా పులిగడ్డలో 1943 జులై 15న జన్మించారు. ఆదిని సుబ్బారావు, శేషమ్మ తల్లిదండ్రులు. ఎం.ఏ తెలుగు లిటరేచర్ చేశారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేసి 2001లో ఉద్యోగ విరమణ పొందారు. భర్త కోకా నాగేంద్రరావు ఇప్పటికే కన్నుమూశారు.

సాహిత్యానికి విశేషమైన సేవలు

తెలుగు భాషా చైతన్య సమితి కార్యదర్శిగా, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలిగా అటు భాషకూ, సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారు. వివిధ సాహితీ సంస్థలకు ఆమె సేవలందించారు. అక్షర సందేశం, అరుణమి కోసం, నిశ్శబ్ద వేదన, నవ్యపథం కవితా సంపుటాలు, తరుణీ తరంగాలు, విమలభారతి, కనుపర్తి వరలక్ష్మమ్మ జీవితంసాహిత్యం, శ్రీకృష్ణదేవరాయ ప్రతిభాపుష్పం వ్యాస సంపుటాలు, పున్నమి నవ్వింది, మనసు కదిలింది కథా సంపుటాలు వెలువరించారు. సాహిత్య ప్రస్థానంలో ఆమె Creative Writing లో అద్భుత ప్రతిభ కనబరిచారు.

పురస్కారాలు మరియు గౌరవాలు

1988లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి చేతులమీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్, ఇన్నర్వీల్ క్లబ్ ఏలూరు, పెన్నా రచయితల సంఘం, సాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వంటి అనేక సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. సాహితీ సేవలకుగాను కవితరంగిణి, సాహితీ సరస్వతి, బాలసేవారత్న వంటి గౌరవ బిరుదులు దక్కించుకున్నారు. ఆమెకు లభించిన గుర్తింపులు తెలుగు Literary Contributions కి ప్రతీకలుగా నిలిచాయి.

కోకా విమలకుమారి ప్రధాన కృతులు ఏమిటి?
అక్షర సందేశం, నిశ్శబ్ద వేదన, నవ్యపథం, తరుణీ తరంగాలు, పున్నమి నవ్వింది, మనసు కదిలింది వంటి కవితా, కథా సంపుటాలు ఆమె ప్రముఖ కృతులు.

ఆమెకు లభించిన ప్రధాన పురస్కారాలు ఏమిటి?
ఉగాది పురస్కారం, ఉత్తమ కవయిత్రి పురస్కారాలు, సాహితీ సరస్వతి, కవితరంగిణి బిరుదులు ఆమె అందుకున్న గౌరవాలు.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/bjp-should-be-made-a-strong-party-in-every-village/andhra-pradesh/541117/

Andhra Pradesh News Breaking News in Telugu Famous Author Indian Authors Koka Vimala Kumari Latest News in Telugu Literary Personality Obituary News Renowned Writer Telugu Literature Telugu News Today Telugu Novelist Telugu Writer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.