📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ప్రేమ జంటపై దాడి – కుప్పంలో దారుణం

Author Icon By Uday Kumar
Updated: March 6, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమ వివాహంపై కుట్ర

కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం ప్రేమ జంటపై దాడి – కుప్పంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన స్థానికంగా కలవరం రేపింది.

ప్రేమించుకున్న యువజంట

గుడుపల్లి మండలం అగరం కొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్, అదే గ్రామానికి చెందిన కౌసల్య ప్రేమించుకున్నారు. ఈ నెల 3న పెద్దల అంగీకారం లేకుండా తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా యాదగిరి హిల్స్‌లో ఉన్న ఆలయంలో వివాహం చేసుకున్నారు.

గ్రామ పెద్దల సమక్షంలో చర్చ

వివాహం అనంతరం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రేమ జంట గ్రామ పెద్దలను ఆశ్రయించింది. వారి వివాహ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ పంచాయితీకి కౌసల్య తండ్రి శివశంకర్‌ను కూడా పిలిచారు.

ఆకస్మిక దాడి

కుప్పంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌లో రాజీ కుదర్చే ప్రయత్నం జరిగింది. కానీ, కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని ఒప్పుకోని శివశంకర్, పెద్దల సమక్షంలోనే కత్తితో కౌసల్య, చంద్రశేఖర్‌లపై ఒక్కసారిగా దాడి చేశారు.

గాయపడిన వారు

ఈ ఘటనలో కౌసల్య, చంద్రశేఖర్‌తో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన చంద్రశేఖర్ మేనమామ రమేష్, పంచాయితీ పెద్దమనిషి సీతారామప్ప కూడా గాయపడ్డారు. అనంతరం శివశంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆసుపత్రికి తరలింపు

తీవ్రంగా గాయపడిన బాధితులను సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

పోలీసుల చర్య

చిత్తూరు జిల్లా ఎస్‌పి మణికంఠ చందోలు ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను ఆస్పత్రిలో పరామర్శించారు. మొత్తం నలుగురు గాయపడినట్టు తెలిపారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

నిందితుడి అరెస్ట్

దాడికి పాల్పడ్డ నిందితుడు శివశంకర్ పరారీలో ఉన్నారని, అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఎస్‌పి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Breaking News in Telugu Chittoor Chittoor district chittoor tour Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.