Telugu News: Atchannaidu-రైతుల పట్ల జగన్ మొసలి కన్నీరు

Read Time:  1 min
Atchannaidu-రైతుల పట్ల జగన్ మొసలి కన్నీరు
Atchannaidu-రైతుల పట్ల జగన్ మొసలి కన్నీరు
FONT SIZE
GET APP

విజయవాడ : రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే తన పాలనలో రైతులను(Farmers) దోపిడీకి గురి చేయడమేంటి అని ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి అబద్దపు సానుభూతి నటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉల్లి, టమోటా రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించిందని గుర్తు చేశారు. రైతులకు అండగా నిలబడటం అంటే డ్రామాలు కాదు, క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపించడమేనని స్పష్టం చేశారు.

మద్దతు ధర మరియు మార్కెట్ డైనమిక్స్

మార్కెట్లో ధరలు పెరగడం, తగ్గడం అనేది సహజమని, ధరలు తగ్గినప్పుడు మద్దతు ధర చెల్లించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సబ్సీడి రూపంలో సరసమైన ధరలలో ఉత్పత్తులు అందజేస్తామని తెలిపారు.

2025లో ఉల్లి ధరలు పతనమవుతాయని ముందుగానే అంచనా వేసి, క్వింటాకు రూ.1200 మద్దతు ధర ప్రకటించామని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రత్యక్షంగా రైతుల నుండి ఉల్లిని కొనుగోలు చేసి, రైతు బజార్ల ద్వారా అమ్మకాలు చేశామని వివరించారు. అదేవిధంగా మార్కెట్ వ్యత్యాసపు ధర పథకం కింద ప్రభుత్వం రైతులకు అదనపు చెల్లింపులు చేసిందని చెప్పారు.

Atchannaidu

గత ప్రభుత్వ చర్యలతో పోలిక

2016లో 2.77 లక్షల క్వింటాళ్ల ఉల్లిని 7,723 మంది రైతుల నుండి కొనుగోలు చేసి రూ.7 కోట్లు చెల్లించామని, 2018లో 9,740 మంది రైతుల నుండి 3.48 లక్షల క్వింటాలు కొనుగోలు చేసి రూ.6.45 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. 2025లో కూడా వేలాది క్వింటాల ఉల్లి కొనుగోలు జరిగిందని వివరించారు.

జగన్ హయాంలో 2020లో ఉల్లి ధరలు పడిపోయినప్పుడు నామమాత్రంగా రూ.770 మద్దతు ధర ప్రకటించి, ఏ ఒక్కరి దగ్గరా ఉల్లి కొనుగోలు చేయలేదని విమర్శించారు. ఆ సమయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ స్పందించలేదని ఆరోపించారు. కేవలం 250 మంది రైతుల దగ్గర రూ.75 లక్షల విలువైన ఉల్లిని కొనుగోలు చేసి మోసం చేశారని అన్నారు.

బహిరంగ సవాలు

ప్రస్తుతం రైతు బజార్లలో ఉల్లి ధరలు రూ.12–15 ఉంటే, బిగ్‌బాస్కెట్‌లో(BigBasket) రూ.34కి అమ్ముతున్న విషయాన్ని మాజీ సీఎం జగన్ ప్రస్తావించడం ఆశ్చర్యమని చెప్పారు. 2020లో మీ పాలనలో ఎంత ఉల్లి కొనుగోలు చేశారో, రైతులకు ఎన్ని కోట్లు చెల్లించారో బహిరంగంగా చెప్పగలరా అంటూ సవాలు విసిరారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడాను ఉదాహరణలతో సహా వివరించామని, ఇలాగే బహిరంగంగా చెప్పే ధైర్యం జగన్‌కి ఉందా అని ప్రశ్నించారు.

మంత్రి అచ్చెన్నాయుడు జగన్‌పై ఎందుకు విమర్శలు చేశారు?
ఉల్లి, టమోటా రైతుల పట్ల జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని, తన పాలనలో రైతులను పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రస్తుత ప్రభుత్వం రైతుల కోసం ఏ చర్యలు తీసుకుంది?
ఉల్లి, టమోటా రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర ప్రకటించి, రైతుల నుండి ప్రత్యక్షంగా పంటలు కొనుగోలు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/chairman-sarath-chandra-telugu-efforts-for-language-development-through-sanskrit-academy/andhra-pradesh/548718/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.