📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Ashok Gajapathi Raju: టీడీపీకి రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు

Author Icon By Sharanya
Updated: July 18, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju). గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో, పార్టీకి తన ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజకీయ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

గోవా గవర్నర్‌గా ఎంపిక… ఆ తర్వాతి చర్యలు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనను గోవా గవర్నర్‌ (Governor of Goa) గా నియమించింది. త్వరలోనే గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామం నేపథ్యంలో తనకు ఇప్పటివరకు అనేక అవకాశాలు కల్పించిన టీడీపీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, టీడీపీ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు, పల్లా శ్రీనివాసరావులకు రాజీనామా లేఖ పంపారు.

ఎన్టీఆర్ హయాంనుంచి రాజకీయ యాత్ర

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఏడు సార్లు ఎమ్మెల్యే…ఎంపీగా ఒకసారి బాధ్యతలు

అశోక్‌ గజపతి రాజు (Ashok Gajapathi Raju) టీడీపీలో సీనియర్ నేత. విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఒకసారి గెలుపొందారు. అశోక్ గజపతి రాజు తన తండ్రి పీవీజీ రాజు బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అశోక్ గజపతి రాజు తొలిసారిగా 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి అశోక్‌ గజపతి రాజు పార్టీలో కొనసాగుతున్నారు.

1983లో టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు రెండవసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా విజయనగరం నుంచి విజయం సాధించారు. అయితే, 2004లో అశోక్‌ గజపతిరాజు ఓటమి పాలయ్యారు. కానీ, 2009లో తిరిగి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు.

గౌరవంగా ముగిసిన రాజకీయ ప్రస్థానం

2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అశోక్‌ గజపతి రాజు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాణ శాఖ మంత్రిగా చేశారు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేవరకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో నిలిచిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కుటుంబ రాజకీయాల్లో వారసత్వం

అదే సమయంలో విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు బరిలోకి దిగి ఓడిపోయారు. అయితే, 2024 ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలో దిగిన అదితి గజపతిరాజు విజయం సాధించారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ

Andhra politics Ashok Gajapathi Raju Ashok Gajapathi Raju Resignation Breaking News Chandrababu Naidu latest news Political Resignation TDP Senior Leader Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.