📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సు కండక్టర్లకు పవర్‌ బ్యాంకులు

Author Icon By Anusha
Updated: December 27, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీఎస్‌ఆర్టీసీ (AP) స్త్రీశక్తి ఉచితబస్సు పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీశక్తి బస్సుల్లో పనిచేసే కండక్టర్లకు ఇకపై ఈపోస్ యంత్రాలతో పాటు అదనంగా పవర్ బ్యాంకులు కూడా అందించాలని నిర్ణయించారు. కొన్ని రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. టికెట్లు జారీ చేయడానికే ప్రస్తుతం ఉన్న ఈపోస్ యంత్రాల బ్యాటరీ సామర్థ్యం సరిపోవడం లేదు.

Read Also: AP: భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌లు

(AP) ప్రస్తుతం స్త్రీశక్తి బస్సుల్లో ఉపయోగించే ఈపోస్ యంత్రాల బ్యాటరీ సామర్థ్యం 3,300 ఎంఏహెచ్ మాత్రమే ఉండటంతో, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న బస్సుల్లో టికెట్ల జారీకి మాత్రమే ఛార్జింగ్ సరిపోతోంది.

దీనివల్ల రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో ఉచిత టికెట్లు ఇవ్వడం సాధ్యపడకపోవడంతో కండక్టర్లు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం

APSRTC’s key decision…power banks for bus conductors

జీపీఎస్ ట్రాకింగ్‌కు ఈపోస్‌ యంత్రాలను వినియోగిస్తుండటం

కండక్టర్లకు వినియోగంలో ఉన్న ఈపోస్‌ యంత్రాలతో పాటు అదనంగా పవర్ బ్యాంకులు అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం టికెట్ల జారీతో పాటు జీపీఎస్ ట్రాకింగ్‌కు ఈపోస్‌ యంత్రాలను వినియోగిస్తుండటంతో బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. జీపీఎస్ ట్రాకింగ్ నిరంతరం కొనసాగేందుకు 20 వేల ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉన్న మొత్తం 17,880 పవర్ బ్యాంకులను కొనుగోలు చేసి కండక్టర్లకు

అందజేయాలని యాజమాన్యం నిర్ణయించింది.ఈ పవర్ బ్యాంకులను గుంటూరు-11 డిపోలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా, బ్యాటరీ బ్యాకప్ సమర్థవంతంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అన్ని డిపోల్లో స్త్రీశక్తి పథకం అమలవుతున్న బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లకు ఈ పవర్ బ్యాంకులు అందజేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

APSRTC EPoS Machines free bus scheme latest news Sthree Shakthi Scheme Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.