हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

సంక్రాంతికి సొంతవూర్లకు వెళ్లేవారికి తీపి కబురు

Sudheer
సంక్రాంతికి సొంతవూర్లకు వెళ్లేవారికి తీపి కబురు

సంక్రాంతి పండుగ సందర్బంగా తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు APSRTC ప్రకటించింది. ఈ బస్సులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులపై అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని APSRTC స్పష్టంగా తెలిపింది. సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. బస్సుల్లో ప్రథమంగా సీట్ల భద్రతను కచ్చితంగా పాటిస్తూ ప్రయాణికులకు సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని APSRTC అధికారులు తెలిపారు.

సాధారణంగా MGBS (మహాత్మా గాంధీ బస్సు స్టేషన్) వద్ద సంక్రాంతి సమయంలో తీవ్ర రద్దీ కనిపిస్తుంది. దీనిని తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సులను గౌలిగూడలోని CBS (సెంట్రల్ బస్ స్టేషన్) నుంచి నడపనున్నట్లు APSRTC ప్రకటించింది.

ఈ ప్రత్యేక బస్సుల ద్వారా, హైదరాబాద్‌లో పనిచేసే ప్రజలు, విద్యార్థులు తమ సొంత ఊళ్లకు సులభంగా చేరుకునే అవకాశం లభిస్తుంది. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలనుకునే వారి కోసం ఈ ఏర్పాట్లు చేయడం ప్రశంసనీయమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రత్యేక బస్సుల వివరాలను, టైమ్ టేబుల్‌ను తమ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా అందుబాటులో APSRTC ఉంచింది. ప్రయాణికులు ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా రద్దీని తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870