APSRTC Free Bus: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) మహిళా ప్రయాణికుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో అమలవుతున్న ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఇకపై కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ బస్సులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: Census 2027 India: జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల
కేంద్రం నుంచి 750 విద్యుత్ బస్సులు
పీఎం-ఈబస్ సేవ (PM-eBus Sewa) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. పర్యావరణ హితంగా ఉండే ఈ బస్సులు త్వరలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో కేవలం విజయవాడ నగరానికే 100 బస్సులను కేటాయించడం విశేషం.
స్త్రీశక్తి పథకం విస్తరణ
రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ‘స్త్రీశక్తి’ పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే, కొత్తగా వచ్చే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, కాలుష్య రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ నిర్ణయంతో దూరప్రాంతాలకు వెళ్లే మహిళలతో పాటు, నగరాల్లో నిత్యం ప్రయాణించే వారికి కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విజయవాడ వంటి రద్దీ నగరాల్లో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: