విజయవాడ : గ్రూప్-1 హైకోర్టుకు నివేదించిన జస్టిస్ శంకర్ కమిటీ కేసు విచారణ 29కి వాయిదా ఏపీపీఎస్సీ (APPSC) లోని నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను మంగళగిరి, సమీపం హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో మూల్యాంకనం చేసినట్లు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వం లోని స్వతంత్ర కమిటీ తేల్చింది. ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేశారని పేర్కొంది. ఈ మేరకు నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక ప్రతులను ఇరుపక్షాల న్యాయవాదులు రిజిస్ట్రీ నుంచి పొందేందుకు వెసులుబాటు ఇచ్చింది. మరో వైపు మూల్యాంకనంలో గతంలో వాదనలు ముగింపు తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం, విచారణను ప్రారంభించాలంటూ ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థులు వేసిన అనుబంధ పిటీషన్ ను అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు వద్ద ఉన్న రికార్డుల ధృవపత్రాలు పొందేందుకు న్యాయవాదులకు వీలు కల్పించింది.
Read also: AP: స్టడీ సర్కిళ్ల ద్వారా పేద విద్యార్థులకు సివిల్స్ ఉచిత శిక్షణ

The evaluation at Hi-Land is indeed true
తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం… తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 2018 నాటి నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న కారణంగా పరీక్షను రద్దు చేసి, తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2024 మార్చి 13న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు పొందిన వారు, పొందని వారు ధర్మాసనం ముందు వేర్వేరుగా అప్పీళ్ళు వేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం… నివేదిక ఇచ్చేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ చైర్మన్ గా, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటా రామారావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ, ఫ్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ సభ్యులుగా స్వతంత్ర కమిటీని నియమించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: