📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: APMDC: విదేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు

Author Icon By Rajitha
Updated: November 20, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: విదేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టేందుకు ఏపీ (AP) ఖనిజ అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆలోచన చేస్తున్నది. ఇందులో భాగంగా ఆఫ్రికన్ దేశాల్లో గనులు దక్కించుకోవాలనే దిశలో ప్రణాళికలు సిద్ధం చేసింది. తద్వారా తవ్వకాలు చేసి సంస్థకు అదనపు రాబడి పెంచుకోవాలని భావిస్తోంది. సంస్థకు దశాబ్దాల తర బడి మంగంపేట ముగ్గురాయి తవ్వకాల్లో అనుభవం ఉంది. చీమకుర్తిలో గ్రానైట్ లీజులను కూడా నిర్వహిస్తోంది. కొంతకాలంగా మధ్యప్రదేశ్ లోని సులియారీలో బొగ్గు గనుల్లో తవ్వకాలు ఆరంభించింది. ఈ అనుభవంతోనే విదేశాల్లో లీజులు తీసుకోవాలని భావిస్తోంది. మన రాష్ట్ర పరిధిలోని బొగ్గు గనులకు ప్రభుత్వ రంగ సంస్థ టెండర్లు వేసి, పోటీలో నిలవాలని సీఎం చంద్రబాబు ఇటీవల సూచించారు.

Read also: YS Jagan: సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరైన జగన్

APMDC: Mining operations abroad

బ్లాక్ 12.04 చదరపు కిలోమీటర్ల

దీంతో ఏలూరు జిల్లాలోని చింతలపూడి, సోమవరం బొగ్గు బ్లాక్లకు టెండర్లు వేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. సోమవరం బ్లాక్ లో సగటున జి13 రకం బొగ్గు లభిస్తుంది. ఇది 38.08 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. చింతలపూడి బ్లాక్ లో సగటున జి12 రకం బొగ్గు లభిస్తుంది. బ్లాక్ 12.04 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. సోమవరం, చింతలపూడి బొగ్గు బ్లాక్ ల్లో భూగర్భ మైనింగ్ చేయాలని భావిస్తోంది. అలా చేస్తే గనక సంస్థకు గిట్టుబాటు కాదని కొందరు నిపుణులు అంటున్నారు. దీనికి బదులుగా ప్రత్యేక పద్ధతిలో భూమి లోపలి నుంచి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని సూచిస్తున్నారు.

ఆఫ్రికాలో లభించే ఇనుప ఖనిజం

అయితే ఈ బ్లాక్ కు టెండర్లు దాఖలు చేసేందుకు డిసెంబరు 24 వరకు గడువు ఉంది. ఆ లోపు అధ్యయనం చేసి బిడ్లు వేసేందుకు ఏపీఎండీసీ సిద్ధమవుతుంది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండిసీ) ఇప్పటికే వివిధ దేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు ఆరంభించింది. అదే విధంగా ఏపీఎండీసీ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఆఫ్రికాలో లభించే ఇనుప ఖనిజం, బొగ్గుతో పాటు పలు ముఖ్య ఖనిజాల గనులు తీసుకోవాలనుకుంటోంది. ఇందుకు ఏదైనా ప్రైవేటు సంస్థతో కలిసి జాయింట్ వెంచర్గా ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తోంది. ఏ దేశాల్లో ఏ గనులు దక్కించుకుంటే రాబడి వచ్చే అవకాశం ఉందో అధ్యయనం చేయాలంటూ సలహా సంస్థ కేపీఎంజీని ఆదేశించింది. ఈ మేరకు కసరత్తు మొదలైంది. త్వరలో దీనిపై ముందడుగు పడే అవకాశం ఉందని ఏపీఎండీసీ వర్గాలు తెలిపాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Africa APMDC coal iron_ore latest news mining Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.