📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

News Telugu: AP: యూట్యూబ్‌ ప్రభావం.. అత్తను చంపిన కోడలు

Author Icon By Rajitha
Updated: November 9, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా పెందుర్తిలో చోటుచేసుకున్న ఘోర ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. కుటుంబ కలహాలను తట్టుకోలేక ఓ కోడలు తన అత్తను సజీవదహనం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేపగుంట అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్టుమెంట్‌లో నివసిస్తున్న లలితాదేవి (30) తన అత్త కనకమహాలక్ష్మి (63)పై హత్యా ప్రణాళిక వేసింది. భర్త ఇంట్లో లేని సమయంలో లలితాదేవి, అత్తను పిల్లలతో కలిసి ‘దొంగా పోలీస్’ ఆట ఆడుదామని నమ్మించింది. ఆటలో భాగంగా కనకమహాలక్ష్మి చేతులు, కాళ్లు కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటల్లో చిక్కుకున్న అత్త అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న మనవరాలు శ్రీనయనకు గాయాలయ్యాయి.

Read also: Montha: మొంథా తుఫాన్‌ ప్రభావంపై కేంద్ర బృందాల పర్యటన

AP: యూట్యూబ్‌ ప్రభావం.. అత్తను చంపిన కోడలు

హత్య ఎలా చేయాలి నేరం చేసి తప్పించుకోవడం ఎలా?

AP: ఘటనను ప్రమాదంగా చూపేందుకు లలితాదేవి నాటకం ఆడింది. టీవీ పేలిపోయి అగ్నిప్రమాదం జరిగిందని అరుస్తూ పొరుగువారిని పిలిచింది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పెట్రోల్ వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తులో భాగంగా లలితాదేవి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు, ఆమె యూట్యూబ్‌లో ‘హత్య ఎలా చేయాలి’, ‘నేరం చేసి తప్పించుకోవడం ఎలా’ అనే వీడియోలు సర్చ్ చేసినట్లు గుర్తించారు. విచారణలో ఆమె నేరాన్ని ఒప్పుకుని, అత్త నిరంతరం చాదస్తంగా ప్రవర్తించడంతో కోపం వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh latest news Murder case Telugu News visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.