📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP: హైకోర్టు లో సాక్షి కి షాక్.. పిటిషన్ల కొట్టివేత

Author Icon By Rajitha
Updated: November 5, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సాక్షి (sakshi) దినపత్రికకు ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై మంగళవారం జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పు వెలువరించారు. ఆయన వ్యాఖ్యానిస్తూ — పిటిషనర్లు అపరిపక్వ దశలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులపై ప్రచురితమైన కథనానికి సంబంధించి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సాక్షి పత్రికకు నోటీసులు జారీ చేసింది.

Read also: APSRTC Jobs:  ఏపీఎస్‌ఆర్‌టీసీ లో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?

AP: హైకోర్టు లో సాక్షి కి షాక్.. పిటిషన్ల కొట్టివేత

AP: దానిని సవాల్ చేస్తూ పత్రిక ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కమిటీ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. షోకాజ్ నోటీసు జారీ తర్వాత ఇంకా పలు దశలు ఉంటాయని, పిటిషనర్ల వివరణను కమిటీ పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంది. అడ్వకేట్ జనరల్ వాదనలను సమర్థించిన హైకోర్టు, ఆర్టికల్ 194 (శాసనసభ హక్కులు) మరియు ఆర్టికల్ 19(1A) (వాక్ స్వాతంత్ర్యం) మధ్య ఉన్న సంబంధంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే విచారణ జరుపుతోందని గుర్తుచేసింది. అలాంటి పరిస్థితిలో కమిటీ పనిలో జోక్యం సరైంది కాదని స్పష్టం చేస్తూ, పిటిషన్లు అపరిపక్వమైనవని పేర్కొని వాటిని కొట్టివేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh High court latest news privilege case Sakshi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.