📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

AP: రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

Author Icon By Aanusha
Updated: December 24, 2025 • 8:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలుకానుంది.

Read Also: DyCM Pawan: Dy.CM ఆదేశాలతో AP అటవీ ప్రాంతాల్లో వన్యజంతు భద్రతా చర్యలు

గోధుమలను రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయిస్తోంది

ఈ పథకాన్ని మొదట 26 జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యపట్టణాలు, నగరాల్లో అమలు చేయనున్నారు. ప్రతి రేషన్ కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని పంపిణీ చేయడానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చర్యలు తీసుకుంటోంది. జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్రం నెలకు 1,838 టన్నుల గోధుమలను (AP) రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయిస్తోంది. కేంద్రం కేటాయించిన గోధుమలను ఎఫ్‌సీఐ (FCI) ద్వారా తీసుకున్న రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ,

AP: Wheat flour available for Rs. 20 at ration shops

వాటిని నాణ్యమైన గోధుమ పిండిగా మార్చి, ప్రతి రేషన్ కార్డుకు ఒక కిలో చొప్పున ప్యాకెట్లలో పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల చివరి నాటికి అన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు ఈ పిండిని చేర్చి, జనవరి 1 నుంచి కార్డుదారులకు అందజేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ గోధుమ పిండిని తీసుకోవడానికి రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపిస్తే, వారి డిమాండ్‌ను బట్టి రాష్ట్రంలోని కార్డుదారులందరికీ ప్రతి నెలా సబ్సిడీపై గోధుమ పిండిని సరఫరా చేసేందుకు పౌరసరఫరాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Civil Supplies Department latest news Public Distribution System ration shops subsidised food Telugu News Wheat Flour

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.