📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

AP: కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

Author Icon By Saritha
Updated: February 6, 2026 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కార్మికులకు వరాలు ప్రకటించారు. కార్మికుల్లో పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను పెంచే అంశంపై దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటా బేస్ కు రూపకల్పన చేయాలి గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు పెరిగేలా కార్యాచరణ సిద్దం చేయాలి. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులు విదేశాలకు వెళ్లి ఆదాయాలు వచ్చేలా చూడాలి’ అన్నారు.

Read Also: TS: అనుబంధ గుర్తింపు కోసం 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Welfare schemes for workers have been restarted.

నైపుణ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు

(AP) ‘ప్రసూతికి రూ.20వేలు, వివాహానికి రూ.40వేలు, సహజ మరణానికి రూ.60వేలు, అంత్యక్రియలకు రూ.20వేలు ఆర్థికసాయం అందించాలి ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. కార్మికులకు నిర్మాణ రంగంలో నైపుణ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. దీని కోసం ప్రముఖ నిర్మాణరంగ సంస్థల సహకారం తీసుకోవాలి. ఈ నైపుణ్య శిక్షణ తర్వాత అర్హులైన వారికి విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడాలి.

జిల్లాల వారీగా కార్మికులకు సంబంధించి వారి నైపుణ్యాలపై ఓ డేటా బేస్ రూపొందించాలి. ఈ వివరాలను నైపుణ్యం పోర్టల్‌తో లింక్ చేయాలి. కార్మికులు కూడా వారికి అవసరమైన కోర్సులు పూర్తి చేసేలా ప్లాన్ చేయాలి వారి ఆదాయాలు పెరిగేలా చూడాలి. కార్మికులకు ఆయా రంగాలకు సంబంధించి అవసరమైన ఆధునిక పరికరాలను కూడా అందజేయాలి అని ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AP Government CM Chandrababu naidu Labor Department Latest News in Telugu Modern Skills Training skill development Telugu News Workers Welfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.