(AP) ఆంధ్రప్రదేశ్లో కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కార్మికులకు వరాలు ప్రకటించారు. కార్మికుల్లో పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను పెంచే అంశంపై దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటా బేస్ కు రూపకల్పన చేయాలి గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు పెరిగేలా కార్యాచరణ సిద్దం చేయాలి. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులు విదేశాలకు వెళ్లి ఆదాయాలు వచ్చేలా చూడాలి’ అన్నారు.
Read Also: TS: అనుబంధ గుర్తింపు కోసం 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

నైపుణ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు
(AP) ‘ప్రసూతికి రూ.20వేలు, వివాహానికి రూ.40వేలు, సహజ మరణానికి రూ.60వేలు, అంత్యక్రియలకు రూ.20వేలు ఆర్థికసాయం అందించాలి ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. కార్మికులకు నిర్మాణ రంగంలో నైపుణ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. దీని కోసం ప్రముఖ నిర్మాణరంగ సంస్థల సహకారం తీసుకోవాలి. ఈ నైపుణ్య శిక్షణ తర్వాత అర్హులైన వారికి విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడాలి.
జిల్లాల వారీగా కార్మికులకు సంబంధించి వారి నైపుణ్యాలపై ఓ డేటా బేస్ రూపొందించాలి. ఈ వివరాలను నైపుణ్యం పోర్టల్తో లింక్ చేయాలి. కార్మికులు కూడా వారికి అవసరమైన కోర్సులు పూర్తి చేసేలా ప్లాన్ చేయాలి వారి ఆదాయాలు పెరిగేలా చూడాలి. కార్మికులకు ఆయా రంగాలకు సంబంధించి అవసరమైన ఆధునిక పరికరాలను కూడా అందజేయాలి అని ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: