📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

News Telugu: AP: రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తాం: పీయూషకుమార్

Author Icon By Rajitha
Updated: December 12, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ప్రభుత్వ శాఖలను మూడు విభాగాలుగా చేసి జీఎస్డీపీతో మ్యాపింగ్ చేశాం ఏపీ తప్ప ఏ రాష్ట్రమూ ప్రతి త్రైమాసికానికి ఇలా వృద్ధి గణాంకాలు విడుదల చేయడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఏడాది ఒకటి రెండు సార్లు విడుదల చేసినా ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ఈ నివేదికలు ఎంతో ఉపయోగపడతాయి’ అని రాష్ట్ర ప్రణాళిక, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శి పీయూషకుమార్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.16.88 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తిని సాధించాలనేది లక్ష్యమని తెలిపారు. తొలి 6 నెలల్లో 41% సాధించామని, మిగిలిన లక్ష్య సాధనకు రంగాల వారీగా నిర్దిష్ట వ్యూహాలు అవలంభిస్తామని చెప్పారు.

Read also: Ananthapuram: వార్డెన్ పై కోపంతో విద్యార్థినుల ఆత్మహత్యా

We will achieve production worth ₹16 lakh crore in the state

జాతీయ స్థాయితో పోలిస్తే 2.6% అధికంగా

రాష్ట్రవృద్ధి రేటు ఎంతో బాగున్నా ద్రవోల్బణం వల్ల ఆ వృద్ధి మొత్తం ప్రతిఫలించడం లేదు. జాతీయ స్థాయితో పోలిస్తే 2.6% అధికంగా ఉంది. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖలో కొత్త పారావీ ఎటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయంలో కూడా వినియోగం ఆధారంగా ఉత్పత్తి ఉండేలా చూస్తున్నాం. ఆర్టీజీఎస్ నూ అనుసంధానం చేస్తున్నాం. పరిశ్రమల రంగంలో దేశం కన్నా మంచి పురోగతి సాధించాం. మధ్య చిన్న తరహా పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు అందించాం. అంతర్జాతీయ డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉండేలా చూస్తున్నాం. గనుల విభాగాన్ని కూడా బలోపేతం చేశాం. ఆర్టీజీఎస్లో ప్రత్యేకంగా ‘డిజీ వెరిఫై’ అనే ఏర్పాటు చేశాం. ఏ ధృవపత్రాలైనా ఇక ఈ విభాగంలో సులభంగా, వేగంగా తనిఖీ చేయవచ్చు.

ఏపీపీఎస్సీ వంటి సంస్థలకు ఉద్యోగాలు

అవి అసలైనవో కావో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆర్టీజీఎస్ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. అని ఐటీ ఆర్టీజీ శాఖల కార్యదర్శి కాటమనేని భాస్కర్ చెప్పారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల కోసమే లబ్ధిదారులు సమర్పించే ధృవ పత్రాలను విద్యార్థుల సర్టిఫికెట్లను తనిఖీ చేయాలన్నా, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే ఎంతో వేగoగా పరిశీలన పూర్తవతుందన్నారు. ఏపీపీఎస్సీ వంటి సంస్థలకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ధృవీకరణ పత్రాల తనిఖీకి చాలా సమయం పడుతోందని, ఇక ఆ అవసరం ఉండదని డిజి వెరిఫై ద్వారా సులభంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సదుపాయాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

APDevelopment DigiVerifyAP GSDP2025 ITRTG latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.