हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: AP Vs KA: గూగుల్ విషయంలో కర్ణాటక ఆంధ్రల మధ్య మతాల యుద్ధం

Rajitha
News Telugu: AP Vs KA: గూగుల్ విషయంలో కర్ణాటక ఆంధ్రల మధ్య మతాల యుద్ధం

AP Vs KA: విశాఖపట్నంలో (vishakapatnam) గూగుల్ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెండు రాష్ట్రాల ఐటీ మంత్రులు సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం వ్యాఖ్యలు చేసుకుంటూ, పెట్టుబడుల అంశంపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల ఎక్స్‌ (ట్విట్టర్‌)లో “ఆంధ్రా వంటల్లో కారం ఎక్కువగా ఉంటుంది.. అలాగే మన పెట్టుబడుల్లో కూడా ఉంది. ఈ ఘాటు పెట్టుబడులు పొరుగువారికి వేడి పెడుతున్నాయి” అని ట్వీట్‌ చేశారు. దీని నేపథ్యంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటుగా స్పందించారు. ప్రియాంక్ ఖర్గే ట్వీట్‌లో పేర్కొంటూ “ప్రతి వంటకంలో కాస్త ఘాటు అవసరమే కానీ, సమతుల్యత కూడా ఉండాలి. అదే విధంగా బడ్జెట్‌లో కూడా సమతుల్యత అవసరం. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు ఇప్పుడు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేవలం ఏడాదిలోనే రూ.1.6 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP)–ఆదాయ లోటు వ్యత్యాసం కూడా పెరిగింది,” అని వ్యాఖ్యానించారు. చివరగా, “పొరుగువారి అసూయ.. యజమానికి గర్వం” అంటూ వ్యంగ్యంగా ముగించారు.

Read Also: Visakhapatnam: విశాఖలో భారీ పెట్టుబడి

AP Vs KA

AP Vs KA: గూగుల్ విషయంలో కర్ణాటక ఆంధ్రల మధ్య మతాల యుద్ధం

ఇక దీనికి ప్రతిగా నారా లోకేశ్ మరోసారి స్పందిస్తూ, “కర్ణాటక (karnataka) ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిలో వెనుకబడి ఉంది. వారి వద్ద ఉన్న పరిశ్రమలే మౌలిక సదుపాయాల లోపాన్ని, విద్యుత్ కోతలను ప్రస్తావిస్తున్నారు. ముందుగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలి,” అని చెప్పారు. ప్రియాంక్ ఖర్గే ఇంతకుముందు కూడా ఏపీపై విమర్శలు చేశారు. గూగుల్ ప్రాజెక్ట్‌ కోసం ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోందని, వాటిని దాచిపెడుతోందని ఆరోపించారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం — “రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీ మంచిదే. కానీ అది వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లకూడదు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పోటీ పడితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది,” అని పేర్కొన్నారు.

ఏపీ, కర్ణాటక మధ్య వివాదం ఏ అంశంపై ప్రారంభమైంది?
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.

నారా లోకేశ్ ట్వీట్‌లో ఏమన్నారు?
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఘాటుగా ఉన్నాయని, పొరుగువారికి కూడా వేడి పెడుతున్నాయని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870