విశాఖపట్నంలో(AP) భారీగా అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కఠినంగా స్పందించారు. ఈ దందాకు సంబంధించిన ముఠాల అసలు మూలాలను వెంటనే గుర్తించాలంటూ పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. కేసులో ఎంతటి వ్యక్తులు ఉండినా క్షమించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు. విషయం బయటపడిన వెంటనే ఆయన స్వయంగా పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి మొత్తం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read also: విమాన ప్రమాదంలో మృతురాలి కుటుంబానికి 317 కోట్లు
1.89 లక్షల కిలోల గోమాంసం స్వాధీనం
డీఆర్ఐ(AP)అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజీపై దాడి నిర్వహించి 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసును పోలీసులకు అప్పగించారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వహకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ పవన్ కల్యాణ్కు తెలిపారు. మాంసం ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడికి తరలించాలనుకున్నారు, అనుమతుల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. తప్పిదం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.
పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ, అక్రమ గోవధ, గోమాంసం సరఫరా లేదా ఎగుమతులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. తన దృష్టికి వచ్చిన తర్వాత పిఠాపురంలో ఉన్న అక్రమ వధశాలను గతంలో మూసివేయించిన ఉదాహరణను గుర్తుచేశారు. గోవధ నిషేధానికి ఎన్డీయే ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపిస్తుందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: