📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: AP: అమెరికాలో మహిళ హత్య..నిందితుడిని గుర్తించిన పోలీసులు

Author Icon By Saritha
Updated: November 20, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : అమెరికాలో(America) దాదాపు 8 ఏళ్ళ కితం హత్యకు గురైన ఏపీ మహిళ హత్యకేసులో అసలు నిందితుడిని అక్కడి పోలీసులు గుర్తించారు. అమెరికాలో(AP) ఆంధ్రప్రదేశ్ కు చెందిన శశికళ నర్రా అనే మహిళ 2017లో తన కుమారుడితో సహా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎనిమిదేళ్ళ తర్వాత అసలు నిందితుడుని గుర్తించారు. అసలేమయ్యిందంటే… ఆంధ్రప్రదేశ్ కు చెందిన నర్రా హనుమంతరావు అనే వ్యక్తి అమెరికాలోని న్యూజెర్సీలో భార్య శశికళ, కొడుకు అనీష్ సాయితో కలిసి నివసించేవాడు. 2017 మార్చి 23న హనుమంతరావు విధులు ముగించుకుని వచ్చేసరికి… మాపుల్ షేడ్ లోని వారి అపార్ట్మెంట్లో భార్య, కొడుకు రక్తపు మడుగులో పడిఉండటాన్ని గుర్తించారు.

Read also: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం

Woman murdered in America.. Police identify suspect

హనుమంతరావు నిర్దోషి, కొత్త కోణంలో దర్యాప్తు

దీనిపై పోలీసులకు(AP) సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వీరి మరణాలకు భర్త నర్రా హనుమంతరావే కారణమని…అతడికి ఒక కేరళ మహిళకు మధ్య ఉన్న వివాహేతర సంబంధంతోనే భార్యాబిడ్డలను హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపించడంతో అతడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఘటనాస్థలంలో లభించిన డిఎన్ఎ హనుమంతరావు డీఎన్ఏతో సరిపోకపోవడంతో అతడిని విడుదల చేశారు. హనుమంతరావు సహోద్యోగి హమీద్ గొడవలు ఉన్నట్లు విచారణలో భాగంగా అధికారులు గుర్తించారు. ఈ హత్య కేసులో హమీదుకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సమయంలో హత్య జరిగిన ఆరు నెలల అనంతరం అతను భారత్ కు తిరిగి వెళ్ళినట్లు గుర్తించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh AP woman murder DNA evidence New Jersey case Shashikala Narra US investigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.