📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: తలసరి పాల వినియోగంలో ఏపీ టాప్

Author Icon By Aanusha
Updated: November 26, 2025 • 7:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తలసరి పాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ (AP) టాప్ లో ఉంది, జాతీయ సగటు 459 గ్రాములుగా ఉండగా, రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి రోజుకు సగటున 719 గ్రాముల పాలు వినియోగిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు వెల్లడించారు. ఈ గణాంకాలు రాష్ట్రంలో పాల ఉత్పత్తి, పాలు ఆధారిత పరిశ్రమలు, పశుపోషణ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో స్పష్టంగా చెబుతున్నాయి.

Read Also: Handloom Sale: చేనేతకు సంక్రాంతి వరం

ఏపీ పాల ఉత్పత్తితో దేశంలో 7వ స్థానం

2033 నాటికి రాష్ట్రంలో పాల ఉత్పత్తిని 150 లక్షల టన్నులకు పెంచి, దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏపీ (AP) 139.46 లక్షల టన్నుల పాల ఉత్పత్తితో దేశంలో 7వ స్థానంలో ఉందని తెలిపారు.

AP tops in per capita milk consumption

రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పశుపోషణపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని వివరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో పాలు, పాల ఉత్పత్తుల విలువ రూ. 713.9 బిలియన్లు ఉందని, దీనిని 2033 నాటికి రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం పశుపోషకులకు అనేక రాయితీలు అందిస్తోందని దామోదర్ నాయుడు (Damodar Naidu) పేర్కొన్నారు.

2025 అఖిల భారత పశుగణన ప్రకారం రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు ఉన్నట్లు ఆయన తెలిపారు. గత తొమ్మిదేళ్లలో జాతీయ పాల ఉత్పత్తి 58% వృద్ధి చెందిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు పాల రంగం 5% తోడ్పాటు అందిస్తోందని గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh milk consumption AP per capita milk use Damodar Naidu India dairy sector latest news milk production growth Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.