విజయవాడ:రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు (Plastic pollution) పెరిగిపోతుండటంతో.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు, 202 గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటిని శుద్ధి చేసి, తిరిగి ఉపయోగపడేలా చేసేందుకు ఈ ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.33.60 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో 210 ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను నిర్మించి, వాటిని ఆధునిక యంత్రాలతో తీర్చిదిద్దుతారు.
Read also: Chandrababu: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ని స్వాగతించిన సీఎం
The government has allocated ₹33.60 crore
ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత
ఈ యూనిట్లు గ్రామాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ ను తగ్గించడమే కాకుండా, పర్యావరణాన్ని పరిరక్షిoచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.. ఈ ఉత్తర్వుల ప్రకారం, గ్రామ పంచాయతీలు ఈ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పెరగడమే కాకుండా, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇది ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ యూనిట్లు ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసి, కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా ఉపయోగపడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: