(Mangalagiri) మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో సమావేశం ప్రారంభం కానుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధ్యక్షతన ఈ కీలక సమావేశం ప్రారంభంకానుంది. (AP) అంబటి రాంబాబు అరెస్ట్ ఇష్యూ, ముద్రగడ లేఖపై చర్చించే అవకాశాలున్నాయి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం, సిట్ లేఖ, పార్టీలో వరుస వివాదాలు, కీలక పరిణామాలపై పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు.
Read Also: Leopard Attack: అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి
(AP) ఈ భేటీకి పార్టీకి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు అందరూ హాజరవుతున్నారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా, నగర అధ్యక్షులు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, పార్టీ అధికార ప్రతినిధులు, వివిధ సెల్ ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొని పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారంలో కేడర్ పాత్ర, రాబోయే రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సుమారు మూడు గంటల పాటు సాగనున్న ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: