ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ 2025 సంవత్సరానికి చెందిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ AP TET 2025 (AP TET 2025) షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటన గురువారం, అక్టోబర్ 2025లో వెలువడింది.ఏపీ టెట్ 2025 (AP TET 2025) లో విద్యార్థులు,టీచర్లకు సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చకచకా చేసింది. షెడ్యూల్ ప్రకారం, ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 24, 2025 నుంచి ప్రారంభమవుతున్నాయి. అభ్యర్థులు నవంబర్ 23, 2025వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
IGMCRI: ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగాల అప్డేట్
నవంబర్ 25న ఆన్లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారని, డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.డిసెంబర్ 10న 2 షిఫ్టుల్లో టెట్ ఆన్లైన్ రాత పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటలకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరుగుతాయని ఏపీ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి (MV Krishna Reddy) ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టెట్ ఫలితాలను జనవరి 19వ తేదీన వెల్లడిస్తామని
ఇక టెట్ ఫలితాలను జనవరి 19వ తేదీన వెల్లడిస్తామని చెప్పారు. ఈ మేరకు టెట్ పూర్తి నోటిఫికేషన్ శుక్రవారం (అక్టోబర్ 24) విద్యాశాఖ విడుదల చేయనుంది. ఇతర వివరాలకు హెల్ప్ డెస్క్ నంబర్లు 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286ను సంప్రదించాలని సూచించింది.కాగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరని తేల్చింది.
ఇదే అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనూ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్ పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి 5 ఏళ్లలోపు మాత్రమే సర్వీసు మిగిలి ఉన్నవారికి టెట్ నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: