📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Students: ఇంటర్ విద్యార్థులపరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

Author Icon By Aanusha
Updated: October 3, 2025 • 9:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు (AP Intermediate Board) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి.

AP: ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం – 2.90 లక్షల మందికి లబ్ధి

ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీ ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

అలాగే ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఇది తాత్కాలిక షెడ్యూల్‌ మాత్రమేనన్న ఇంటర్మీడియట్ బోర్డు.. పరిస్థితులను అనుసరించి షెడ్యూలులో మార్పు చేసే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి

మరోవైపు ఈసారి నెల ముందుగానే ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరిలోనే నిర్వహించాలని ఏపీ ఇంటర్ బోర్డు గతంలో నిర్ణయించింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పటి వరకూ మార్చి నెలలో జరిగేవి.

AP Students

అయితే సీబీఎస్‌ఈతో పాటుగా ఈసారి నుంచి ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. అలాగే ఏప్రిల్‌ నుంచి ఇంటర్ తరగతులను నిర్వహించడం కోసం పరీక్షలన్నీ ముందే పూర్తవుతాయి. అలాగే పరీక్షల విధానంలోనూ ఈసారి మార్పులు జరిగాయి. తొలుత సైన్స్‌ గ్రూప్ విద్యార్థులకు గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు నిర్వహిస్తారు.

ఇతర సబ్జెక్టులకు పరీక్షలు ఉండేవి

రోజూ ఓ సబ్జెక్ట్ మీద పరీక్ష ఉంటుంది. ఉదాహరణకు గతంలో ఎంపీసీ విద్యార్థులకు (MPC students) సబ్జెక్టు పరీక్ష ఉంటే.. ఆ రోజు ఆర్ట్స్, బైపీసీ గ్రూపుల విద్యార్థులకు ఇతర సబ్జెక్టులకు పరీక్షలు ఉండేవి.అయితే ఇప్పుడు పరీక్షల విధానం మారింది. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్ పరీక్ష ఉంటే ఆ రోజు కేవలం ఆ సబ్జెక్టు మీద పరీక్ష మాత్రమే ఉంటుంది.

ఎందుకంటే ఇటీవల ఎంబైపీసీ గ్రూపును తీసుకువచ్చారు. దీంతో ఎంపీసీ విద్యార్థులకు కూడా జువాలజీ చదివే అవకాశం ఉంటుంది. అయితే ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక.. ఒక రోజు ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. సైన్స్‌ గ్రూపు విద్యార్థుల (Science group students) సబ్జెక్ట్ పరీక్షలు పూర్తయ్యాక ఆఖరిలో లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఆ తర్వాత ఆర్ట్స్‌ గ్రూపు పరీక్షలు ప్రారంభమవుతాయి.మరోవైపు జనరల్‌ కోర్సులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే ఒకేషనల్‌ కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Intermediate Exam Time Table AP Inter 1st Year Exams 2026 AP Inter 2nd Year Exams 2026 AP Inter Exams 2026 Breaking News latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.