ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ కూలీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద జారీ చేసిన జాబ్ కార్డులు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్య కేవలం ఐదు వారాల వ్యవధిలోనే ఏకంగా 11.07 లక్షల జాబ్ కార్డులు తొలగించారు. దేశవ్యాప్తంగా ఈ కాలంలో రద్దైన మొత్తం జాబ్ కార్డుల్లో 68 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్కే (AP) చెందినవిగా ఉండటం గమనార్హం.
Read also: AP: డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన
AP
కేవైసీ తప్పనిసరి చేయటంతో
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏపీలో మొత్తం 18.38 లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ సంఖ్య అత్యధికం. దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో లక్షలోపు జాబ్ కార్డులే రద్దుకాగా, ఒడిశాలో 80,896, జమ్మూ కశ్మీర్లో 79,070 కార్డులు తొలగించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా ఉపాధి హామీ జాబ్ కార్డులు రద్దైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం తరచూ జాబ్ కార్డులపై సమీక్షలు చేపడుతోంది. చనిపోయిన వారు, దీర్ఘకాలంగా పనిచేయని వారు, వలస వెళ్లిన వారి కార్డులను తొలగించటం నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఇటీవల జాబ్ కార్డులకు కేవైసీ తప్పనిసరి చేయటంతో రద్దుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి కేంద్రం రూ.7,707.21 కోట్ల నిధులు విడుదల చేయగా, రాష్ట్రంలో ప్రస్తుతం 51 లక్షల కుటుంబాలు, సుమారు 90 లక్షల కూలీలు ఉపాధి హామీ పథకం కింద నమోదు అయి ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: