(AP) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు స్త్రీ శక్తి పథకానికి అదనంగా రూ.800 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హామీ అయిన ‘సూపర్ సిక్స్’ అమలులో భాగంగా (AP) ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు రీయింబర్స్మెంట్ కింద చెల్లించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది ఆగస్టు 15న విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Read Also: CBN: నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్!
ఈ పథకం అమలు కారణంగా ఆర్టీసీపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని ప్రభుత్వం ముందునుంచీ స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు అయిన ఖర్చుల కోసం నవంబర్ 13న తొలి విడతగా రూ.400 కోట్లను విడుదల చేసింది. తాజాగా మరో రూ.800 కోట్లను విడుదల చేయడంతో ఆర్టీసీకి భారీ ఊరట లభించింది.
ఏటా రూ.1,942 కోట్లు
జీరో టికెట్ ప్రయాణికుల ఛార్జీలను 100% రీయింబర్స్మెంట్ చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇదివరకే తెలిపారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకానికి ఏటా సుమారు రూ.1,942 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
తాజాగా విడుదలైన నిధులతో డీజిల్, సిబ్బంది జీతాలు వంటి నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తొలగిపోతాయని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పథకం అమలు తీరుపై రవాణా శాఖ మంత్రి జనవరి 2026లో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: