📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: AP SSC : టెన్త్ పరీక్షల ఫీజుల చెల్లింపు తుది గడవు 25

Author Icon By Saritha
Updated: November 12, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా 2025- 26 విద్యా(AP SSC) సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డివిడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి పదో తరగతి విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లిం చవచ్చనన్నారు. రెగ్యులర్ విద్యార్థుల తోపాటు గతంలో పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఒకేషనల్ విద్యార్థులు కూడా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 25వ తేదీ వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు ఫీజు చెల్లించడానికి అవ కాశం కల్పించారు. రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబరు 4 నుంచి 10 వరకు, 5.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు.

Read also: RITES సంస్థలో 17 కన్సల్టెంట్ పోస్టుల భర్తీ

AP SSC : టెన్త్ పరీక్షల ఫీజుల చెల్లింపు తుది గడవు 25

ఆలస్య రుసుములతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం

విద్యార్థులు(AP SSC) చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే తాము చదువుతున్న పాఠశాలల్లోని(schools) ప్రిన్సిపల్లకు ఫీజు రుసుమును చెల్లించాలని పరీక్షల డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి సూచించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు ముందుగానే ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ఇక గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్ష రాయాలనుకుంటే రూ.125 చెల్లించాలి. ఒకటి నుంచి మూడు సబ్జెక్టుల వరకు అయితే రూ.110 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. అలాగే వయసు నిర్ధారణ రుసుము కింద రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పైన పేర్కొన్న గడువు తేదీల్లో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటిస్తే తర్వాతి పని దినాన్ని గడువు తేదీగా పరిగణించనున్నారు. విద్యార్థులు చెల్లించిన ఫీజును అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా చెల్లించాల న్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వరకు నిర్వ హించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే త్వరలోనే టైం టేబుల్ కూడా విడుదల చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

10th Class Fee Payment Fee Last Date Latest News in Telugu November 25 Deadline SSC Exams Andhra Pradesh Telugu News Tenth Exams 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.