📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP – కూటమి ప్రభుత్వంపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

Author Icon By Rajitha
Updated: September 16, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బయటకు సుపరిపాలనలా కనిపిస్తున్నా, వాస్తవానికి “రెడ్ బుక్ రాజ్యాంగం” నడుస్తోందని ఆయన ఆరోపించారు. లా అండ్ ఆర్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించే సీఎం, ఆచరణలో మాత్రం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ధ్వజమెత్తారు. అలాగే, “2047 విజన్”(2047 Vision) పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాదు అభివృద్ధి తన క్రెడిట్ అని చెప్పుకోవడం తప్పు అని, మహానగరాలు కాలక్రమేణా సహజంగానే అభివృద్ధి చెందుతాయని శ్రీకాంత్ రెడ్డి చురకలు అంటించారు.

Srikanth Reddy

చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నారని

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్దికాలంలోనే భారీ అప్పులు చేసి, పెన్షన్లు తగ్గించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని (Arogyasri Scheme) నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రులకు రూ. 2,500 కోట్ల బకాయిలు పెట్టడం వల్ల పేదలు చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. (AP) జగన్ హయాంలో నాడు-నేడుతో విద్యా రంగం రూపు మార్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, గ్రామ సచివాలయ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి సంస్కరణలు ప్రజలకు మేలు చేశాయని చెప్పారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులు పక్కనబెట్టి విధ్వంసకర పాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. అమరావతిలో పనులు ప్రారంభించకపోవడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అబద్ధాలు చెబుతూ కాలయాపన చేయడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు హితవు పలికారు.

గడికోట శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు పాలనను ఏమని అభివర్ణించారు?
A1: ఆయన రాష్ట్రంలో బయటకు సుపరిపాలనలా కనిపించినా, వాస్తవానికి “రెడ్ బుక్ రాజ్యాంగం” నడుస్తోందని అన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం విషయంలో ఆయన ఎలాంటి ఆరోపణ చేశారు?
A2: ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని, ఆసుపత్రులకు రూ. 2,500 కోట్ల బకాయిలు పెట్టడం వల్ల పేదలు చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

Read hindi news:  hindi.vaartha.com

Read also:

Breaking News Chandrababu Naidu Gadikota Srikanth Reddy latest news TDP Government Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.