Latest News: CMO: ఏపీ సచివాలయాల పేరును మార్చలేదు: సీఎంఓ

Read Time:  1 min
CMO
CMO
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చారనే వార్తలపై అధికారిక వివరణ వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, సీఎంవో (CMO) (ముఖ్యమంత్రివారి కార్యాలయం) దీనిపై స్పష్టతనిచ్చింది. “సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారనే వార్తలు పూర్తిగా అవాస్తవం” అని సీఎంవో స్పష్టం చేసింది.

Read Also: Amaravati: అమరావతి ఓఆర్ఆర్‌లో మొదలైన భూసేకరణ

సీఎంవో స్పష్టమైన వివరణ ఇచ్చింది

కొన్ని మీడియా వర్గాలు, కొన్ని సోషల్ మీడియా పోస్టులు — గ్రామ, వార్డు సచివాలయాల (Village and ward secretariats) ను ఇకపై ‘విజన్ యూనిట్లు’గా పిలుస్తారని పేర్కొన్నాయి. దీనిపై తప్పుడు అర్థం పుట్టకుండా ఉండేందుకు సీఎంవో (CMO) స్పష్టమైన వివరణ ఇచ్చింది.

CMO
CMO

సీఎంవో ప్రకటన ప్రకారం, “2047 స్వర్ణాంధ్ర విజన్” (“2047 Swarnandhra Vision”) సాధనలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశ్యంతో సీఎం సూచనలు ఇచ్చారని పేర్కొంది.అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.