ఆంధ్రప్రదేశ్ (AP) లో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 22మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది చిత్తూరులో అత్యధికంగా 491 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, విశాఖ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Read Also: Pawan Kalyan: డ్రెయిన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
రెండేళ్ల నుంచి ఏపీ (AP) లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అవుతున్నాయి. 2023లో 548, 2024 సంవత్సరంలో 514 కేసులు నమోదు కాగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 491 కేసులు నమోదయ్యాయి. మరో వైపు తిరుపతి జిల్లాలోనూ కేసులు పెరుగుతున్నాయి. కాకినాడ, విశాఖపట్నం జిల్లాలు కూడా ఆందోళనకర సంఖ్యలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి.శరీరంపై నల్లమచ్చతోపాటు జ్వరం, తలనొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే పెద్దగా సమస్య ఉండదని వైద్యులు చెబుతున్నారు. కానీ చాలామంది జ్వరానికి వాడే సాధారణ మందులు వాడి, పరిస్థితి తీవ్రమయ్యాకే ఆసుపత్రులకు వెళ్తున్నారని తెలిపారు. అందువల్లే ప్రాణాపాయం ఏర్పడుతోంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యాధి నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?
స్క్రబ్ టైఫస్ అనేది ఒరియెంటియా ట్సుట్సుగాముషి (Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా చిగర్ మైట్స్ (చిన్న పురుగులు) కాటు వల్ల వస్తుంది.
Scrub Typhus ఎలా వస్తుంది?
చెట్ల దగ్గర, పొలాల్లో, అడవుల్లో ఉండే చిగర్ మైట్స్ కాటు వేస్తే ఈ వ్యాధి సోకుతుంది.
Scrub Typhus లక్షణాలు ఏమిటి?
ఎక్కువ జ్వరం
శరీరం నొప్పులు
తలనొప్పి
గొంతు నొప్పి
కాటు వేసిన చోట నల్లటి గాయంలాంటి స్పాట్ (Eschar)
వాంతులు
అలసట
Scrub Typhus ప్రమాదమా?
చికిత్స చేయకపోతే ప్రమాదకరం. కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు పై ప్రభావం చూపుతుంది. టైం లో చికిత్స చేస్తే పూర్తిగా క్షేమం అవుతుంది.
Scrub Typhus తో జ్వరం ఎన్ని రోజులు ఉంటుంది?
సాధారణంగా 5–7 రోజులు. కానీ మందులు వాడకపోతే వారం రోజులకంటే ఎక్కువగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: