📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Telugu news: AP Sachivalayam: గ్రామ–వార్డు సచివాలయాలకు ఐవీఆర్‌ఎస్‌ సర్వే

Author Icon By Tejaswini Y
Updated: December 10, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో వైసీపీ పాలనలో ప్రారంభమైన గ్రామ–వార్డు సచివాలయ(AP Sachivalayam) విధానంలో కూటమీ ప్రభుత్వం కీలక మార్పులు చేపడుతోంది. ప్రజలకు పథకాలు, సేవలు మరింత సమర్థంగా చేరేందుకు ఈ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఉద్యోగుల బదిలీలు, సచివాలయాల వర్గీకరణ వంటి అంశాలపై ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు సచివాలయాల పనితీరుపై ప్రజాభిప్రాయం తెలుసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Read also: ప్రభుత్వ సేవలు పూర్తి డిజిటల్‌: సీఎం కీలక ఆదేశాలు

ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో సేవల పర్యవేక్షణ

గ్రామ–వార్డు సచివాలయాల్లో అందిస్తున్న సేవలపై ఐవీఆర్ కాల్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్లు సమాచారం. పథకాల అమలు, ధృవపత్రాల జారీ, దరఖాస్తుల స్వీకరణ, సిబ్బంది అందుబాటు వంటి కీలక అంశాలపై ఈ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సేకరించిన అభిప్రాయాన్ని ఆధారంగా తీసుకుని సచివాలయ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేసే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.

AP Sachivalayam: IVRS survey for village and ward secretariats

సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుదల

ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు ఎప్పటికప్పుడు విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు డీడీవోలు, ఎంపీడీవోలు, ఎంసీలు, ఎంజీవోలు, యూజీవోలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది హాజరు, ప్రజలతో వారి వ్యవహారం, మూమెంట్ రిజిస్టర్ నిర్వహణ వంటి అంశాలపై కఠినమైన సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలపై సచివాలయ ఉద్యోగులు (Secretariat employees) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ మార్పులు, హాజరు నిఘా, ఐవీఆర్ సర్వేలతో తమపై ఒత్తిడి పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర శాఖల ఉద్యోగులకు ఇలాంటి నిబంధనలు లేకపోయినా, తమపై మాత్రమే ప్రత్యేక నిఘా పెట్టడం అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం మాత్రం ఆలస్యం కావడం పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AP governance government reforms IVRS survey public feedback village secretariats ward secretariats

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.