వసూలు చేసిన సొమ్మును ఇప్పుడిచ్చే బిల్లుల్లో సర్దుబాటు చేయాలి. డిస్కంలకు విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు
విజయవాడ : వాణిజ్య కనెక్షన్ల ఎల్డీ విద్యుత్ దారులకు వినియోగ అధికంగా వస్తున్న బిల్లులపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లుల పెరుగుదలకు కారణమైన కిలోవోల్ట్ యాంపియర్ రియాక్టివ్ అవర్ ఫీచర్ను వెంటనే బ్లాక్ చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఇప్పటికే వసూలు చేసిన అదనపు బిల్లుల మొత్తాన్ని సంబంధిత వినియోగదారులకు తర్వాత జారీ చేసే బిల్లుల్లో సర్దుబాటు చేయాలని సూచించింది. గతంలో వైకాపా ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లకు కేవీహెచ్ విధానంలో బిల్లులు ఇవ్వాలని విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది.
Read also: APERC: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్
Relief from high bills for commercial electricity consumers
అధిక బిల్లుల నుంచి వారికి ఊరట కల్పించాలని
ఈ విధానంలో పవర్ ఫ్యాక్టర్ నిర్వహణ కోసం వినియోగదారులు సొంతంగా కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. వాటి వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పించకపోవడంతో కిలో వాట్ తో పోలిస్తే కిలో వోల్ట్ యాంపియర్ వినియోగం ఎక్కువగా నమోదయ్యేది. కేవీ హెచ్ వినియోగం ఆధారంగా డిస్కంలు బిల్లులు ఇచ్చేవి. దీంతో వినిచయోగదారులకు బిల్లుల మోత మోగాది. అధిక బిల్లుల నుంచి వారికి ఊరట కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వైకాపా ప్రభుత్వం నిర్ణయం మేరకు పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్ వినియోగదారులకు 2019-20 ఆర్థిక సంవత్సరం కేవీహెచ్ విధానంలో బిల్లింగ్ చేయాలని కమిషన్ డిస్కంలకు సూచించింది. ఇందుకోసం స్మార్ట్ మీటర్లలో అధిక లీడింగ్ రియాక్టివ్ ఎనర్జీ ఫీచర్ను అన్ బ్లాక్ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు డిస్కంలు అన్ బ్లాక్ చేశాయి. పవర్ ఫ్యాక్టర్ నిర్వహణకు వినియోగదారులు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అయితే, వాటి నిర్వహణపై అవగాహన లేకపోవడంతో రాత్రివేళల్లో కొందరు స్విచ్ ఆపేవారు కాదు. కెపాసిటర్లు రియాక్టివ్ పవర్ వినియోగించుకోవడంతో బిల్లులు పెరిగిపోయేవి. అధిక బిల్లుల వ్యవహారంపై వినియోగదారులు డిస్కంల నుంచి అందిన వినతులను పరిగణనలోకి తీసుకుని కమిషన్ పరిశీలించగా సాధారణ మీటర్లతో పోలిస్తే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత బిల్లులు పెరగడానికి కెపాసిటర్లు రియాక్టివ్ పవర్ ను వినియోగించుకోవడమే కారణమని గుర్తించింది. దీంతో కేవీఏఆర్వాచ్ ఫీచర్ను మళ్లీ బ్లాక్ చేయాలని కమిషన్ డిస్కంలకు విద్యుత్ నియంత్రణ మండలిఉత్తర్వులు ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: