
Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం ఉదయం నుంచే పలు జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. ఇప్పటికే గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: TTD June Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
Andhra Pradesh Rains: ఆరెంజ్, ఎల్లో అలర్ట్ పరిధిలోని జిల్లాలు ఇవే..
గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. మరికొద్దిసేపట్లో అల్లూరి, ఉభయ గోదావరి, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, నెల్లూరు, అనకాపల్లి, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: