ఇటీవల కొద్ది రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాలకు ప్రజలు అస్తవ్యస్థలు పడుతున్నారు. దీనికి గాను వాతావరణశాఖ మరో వారం రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

వాతావరణ పరిస్థితులు – నైరుతి, పశ్చిమ గాలుల ప్రభావం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), యానాం ప్రాంతాలపై దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ గాలులు ప్రభావం చూపుతున్నాయి. ఈ గాలుల వలన రాబోయే మూడు రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
- ఈ రోజు, రేపు: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు (Thunderstorms) ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది.
- ఎల్లుండి: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయి. గాలుల వేగం కొంచెం తగ్గి 30-40 కి.మీ. వద్ద నమోదవుతుంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ & రాయలసీమ
- ఈ రోజు, రేపు: కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచవచ్చు.
- ఎల్లుండి: వర్షాల తీవ్రతలో పెద్దగా మార్పు లేకపోయినా గాలుల వేగం 30-40 కి.మీ. వరకు మాత్రమే ఉంటుందని అంచనా.
ముందస్తు జాగ్రత్తలు – విద్యాసంస్థలకు సెలవులు
భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలు, కళాశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించారు. ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రజలకు హెచ్చరిక
- వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- గాలివానల సమయంలో విద్యుత్ తీగలు, చెట్లు కూలే ప్రమాదం ఉండేందున జాగ్రత్త అవసరం.
- మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లకూడదని వాతావరణశాఖ సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: