AP PSU Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు (PSU), గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. వీరి పదవీ విరమణ వయసును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్పై కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం.
Read Also : Andhra Pradesh CM: అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇచ్చిన చంద్రబాబు కుటుంబం

కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల సమావేశమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, పురపాలక శాఖ మంత్రి నారాయణలతో కూడిన ఈ కమిటీ పదవీ విరమణ వయసు పెంపునకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 8,500 మంది ఉద్యోగులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది.
త్వరలోనే అధికారిక ప్రకటన
గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనలు ముందుకు సాగకపోయినా, ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. వయసు పెంపు వల్ల ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం, పెన్షన్ నిధులు వంటి అంశాలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించిన అనంతరం, ప్రభుత్వం నుండి త్వరలోనే దీనిపై అధికారిక జీవో వెలువడే అవకాశం ఉందని సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :