📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్

AP: సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యం: సిఎండి శివశంకర్ లోతేటి

Author Icon By Rajitha
Updated: January 27, 2026 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి : దక్షిణ భారత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పి డిసిఎల్) పరిధిలో 2.07లక్షల ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఒక్కో గృహానికి 2కిలోవాట్ల సోలార్ పంపిణీకి మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని ఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లో తేటి తెలిపారు. పిఎం సూర్యఘర్ బిజిలీ ముప్త యోజనపథం క్రింద సంస్థ పరిధిలో ఇప్పటివరకు 16వేల రూప్టాఫ్ సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటుచేయడం ద్వారా 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. సంస్థ పరిధిలో ఫీరడ్ లెవల్ సోలరైజేషన్ ద్వారా 610మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

Read also: AP: ఈ నెల 28న కేబినెట్ భేటీ

Priority given to solar power

ఎస్పిడిసిఎల్ పరిధిలో సోలార్ విప్లవం

కుప్పం నియోజకవర్గ పరిధిలో ఫీరడ్ లెవల్ సోలరైజేషన్ పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్ల పనులు పూర్తి చేయడం ద్వారా 141మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. సోమవారం ఎస్పీడిసిఎల్ కార్పొరేట్ సంస్థ పరిధిలోని ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎస్పీడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ పరిధిలో సోలార్ విద్యుత్ ప్రాధాన్యం, సోలార్ విద్యుత్ (solar power) కనెక్షన్లు, స్మార్ట్ మీటర్లుపై ఉపయోగాలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రకాల శకటాలు, నృత్యప్రదర్శనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

పీఎం సూర్యఘర్ పథకానికి వేగం

ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కె. గురవయ్య, అయూబ్ ఖాన్, కె. రామమోహన్రావు, సిజిఎంలు జె.రమణా దేవి, ఆర్. పద్మ, పిహెచ్ జానకిరామ్, కె. ఆదిశేషయ్య, ఎం.మురళీకుమార్, ఎం.ఉమా పతి, ఎం. కృష్ణారెడ్డి, జాయింట్ కార్యదర్శి ఎం.గోపాలకృష్ణ, చీప్ విజిలెన్స్ అధికారి కె.జనార్దన్ నాయుడు, సిజిఆర్ఎప్ చైర్పర్సన్ ఎ. శ్రీనివాస ఆంజనేయమూర్తి, పిఆర్ ఒ టి. మధుసూదన, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విధుల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. సిజిఎంలు ఎం.మురళీకుమార్, ఎన్. శోభా వాలంటీనా, జిఎంలు టిఎస్ రాజశేఖర్రెడ్డి, జి. చక్రపాణి తదితరుల ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Green Energy latest news Renewable Power Solar Energy SPDCL News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.